Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైయక్తిక జీవన సాఫల్యానికి, సాంప్రదాయిక ధర్మాచరణకీ మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు సామాన్యుడు జీవన సాఫల్యత కోరుకుంటాడు. తన చర్యలు ధర్మానికి విరుద్ధంగా వున్నా సరే. అది మానవ సహజమైన లక్షణం. అందుకు విరుద్ధంగా సాంప్రదాయిక ధర్మాచరణ కోసం జీవితాన్ని సైతం బలి పెట్టగల ధీరమనస్కులు కొందరు వుంటారు. వాళ్ళు మహాత్ములు. కానీ తాము జీవితాన్ని ఫణంగా పెట్టి చేసిన ధర్మాచరణ మొత్తం ఒక డొల్ల అని తెలిసినప్పుడు, కోల్పోయినదేదీ తామిక తిరిగి పొందలేమనీ తెలిసినప్పుడు ఆ ధీర మనసులో తలఎత్తే తుఫానులను ఎలా అక్షరాలలో బంధించగలం? కుటుంబ నేపధ్యంలోనే అన్ని బంధాలకు విలువ చేకూరుతుందని, ఆ కుటుంబానికి మూలం వంశవక్షమనీ, ఆ వక్షంలో చిగురంత ఆకైనా, చిన్న పిందె అయినా, ధర్మబద్ధంగా వ్యవహరించవలసిందే అని బలంగా నమ్మే హదయానికి గాయం అయితే ఆ సలపరింతను అక్షరాలలో ఎలా వివరించగలం?
అలా అక్షరాలలో బంధించినవాడు ఎస్.ఎల్ భైరప్ప. దానికి సంయక్తంగా దశ్య రూపం ఇచ్చిన వాళ్లు బివి కారత్, గిరీష్ కర్నాడ్. ఆ నవల వంశవక్ష. ఆ సినిమా కన్నడంలో అయితే వంశవక్ష. తెలుగులో అయితే వంశవక్షం. తెలుగు సినిమాకి బాపు దర్శకత్వం వహిస్తే రచనా బాధ్యత యధావిధిగా ముళ్ళపూడి వెంకటరమణ తలకు ఎత్తునకున్నారు. కన్నడంలోనూ, తెలుగులోనూ చాలా అవార్డులు సాధించిన ఈ సినిమా తెలుగులో ఆశించినంత విజయం సాధించలేదు. కానీ బాపు క్లాసిక్స్లో ఒకటిగా నిలచిపోయింది. రెండు భాషల సినిమాలు యు ట్యూబ్లో అందుబాటులోనే వున్నాయి.
తన మొదటి భార్య భాగమ్మతోనూ, రెండవ భార్య లక్ష్మి తోనూ కొడుకు నంజుండ శ్రోత్రి, కోడలు కాత్యాయని, మనవడు చిన్నితో ప్రశాంతమైన సాగిపోతున్న శ్రీనివాస శ్రోత్రి జీవితంలో ఒక పెద్ద కుదుపు కొడుకు నంజుండ మరణం. నంజుండ జీవితంలో ఏ అనుభవాన్నీ చవిచూడకుండానే జీవితాన్ని ముగిస్తాడు. నంజుండ భార్య కాత్యాయనిది చాలా చిన్న వయసు. ధర్మం ప్రకారరం భర్త చనిపోయాడు కనుక ఆమె శిరోముండనం చేయించుకుని, తెల్లచీర కట్టుకుని మిగతా జీవితమంతా భర్తను తలచుకుంటూ గడిపెయ్యాలి. కాత్యాయని తెల్ల చీరకట్టుకుంటుంది కానీ శిరోముండనం చేయించుకోవడానికి ససేమిరా అంటుంది. అత్తగారు భాగమ్మ శిరోముండనం చేయించుకోమని పోరుపెడుతుంది. కాత్యాయని లక్ష్య పెట్టదు. మామగారు శ్రీనివాస శ్రోత్రి కోడలు పక్షమే వహిస్తాడు.
శ్రీవివాస శ్రోత్రి ధర్మాచరణా బద్దుడు. పెద్దలు, సంప్రదాయం ఏమి చెపుతుందో దాన్ని అక్షరాక్షరం తుచ తప్పకుండా ఆచరిస్తాడు. అయితే అతడిలో వున్న సుగుణం ఏమిటంటే ఎవరి మీద తన అభిప్రాయాలను బలవంతంగా రుద్దడు. ధర్మం ఏమి చెపుతుందో సోదాహరణంగా వివరిస్తాడు. నిర్ణయం వ్యక్తులకే వదిలేస్తాడు. కాత్యాయని శిరముండనం విష్యంలో ఆమెను బలపరచిన శ్రీనివాసశ్రోత్రి ఆమె కాలేజీలో చేరి చదువుకుంటాను అంటే అది ధర్మం కాదు అంటాడు. నంజుండ బి ఏ పూర్తిచేయకుండానే మరణించాడు కనుక అతడి కోరిక అయిన బి ఏ పూర్తిచేయడం భార్యగా తన ధర్మం అని, ధర్మేచా, అర్ధేచ అన్న మంత్రార్ధము అదే అని కాత్యాయని అంటే తండ్రి కోరిక తీర్చడం కొడుకు బాధ్యత అని అదే ధర్మం అని శ్ర్రేనివాస శ్రోత్రి చెప్తాడు. కాత్యాయని మామ గారు ఆశించిన ధర్మాచరణకి విరుద్ధంగా భగవద్గీత, ఉపనిషత్తులు చదవడానికి బదులుగా కాలేజీలో చేరి బి ఏ చదువుతుంది.
కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్ రాజారావును ఆమె ఆకర్షిస్తుంది. ఇద్దరి మధ్యా పరిచయం, ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. పెళ్లి విషయమై మామగారి అనుమతి తప్పనిసరి. కానీ బిఏ చదువుతాను అని చెప్పినంత తేలికగా కాత్యాయని మళ్ళీ పెళ్లిచేసుకుంటాను అని చెప్పలేకపోతుంది. అందుకు మామగారి జీవితమే కారణం. భాగమ్మ, శ్రీనివాస శ్రోత్రిలకు మొదటి బిడ్డ నంజుండ పుట్టేటప్పుడు భాగమ్మ కి కాన్పు కష్టం అవుతుంది. మళ్ళీ రెండవసారి ప్రసవమ అంటే ఆమె ప్రాణాలకే ముప్పు. అందుకని శ్రీనివాస శ్రోత్రి నంజుండ పుట్టినప్పటినుండీ భాగమ్మకి దూరంగా ఉంటాడు. భర్త తన కారణంగా శారీరక సుఖానికి దూరం అయ్యాడు అని భావించిన భాగమ్మ పని మనిషి లక్ష్మిని ఒప్పించి శ్రీనివాస శ్రోత్రి కి రెండవ భార్యగా లక్ష్మిని ఆ ఇంట్లో ప్రవేశ పెడుతుంది భాగమ్మ. కానీ భార్య బతికివుండగానే రెండవ భార్య తో సంగమం ధర్మం కాదని అతడు లక్ష్మిని తాకనైనా తాకడు. రెండవ పెళ్లి చేసుకుని లక్ష్మికి అన్యాయం చేశాననీ బాధ పడుతూ ఉంటాడు. అలంటి శ్రీనివాస శ్రోత్రితో తను రెండవ పెళ్లి చేసుకుంటాను అని ఎలా చెప్పగలదు? అందుకే ఆమె తన కోరికను ఒక వుత్తరం ద్వారా శ్రీనివాస శ్రోత్రికి తెలియచేస్తుంది..
అప్పుడు శ్రేనివాస శ్రోత్రి ఏమి చెప్తాడు? మొదటినుండీ అతడికి సమాజంతో పనిలేదు. కనుక కోడలు కాత్యాయని రెండవ పెళ్లి చేసుకుంటే సమాజం ఎలా స్పందిస్తుంది అన్న విషయంతో అతడికి పేచీ లేదు. కానీ ధర్మం ఏమంటుంది? సంప్రదాయం ఏమి చెపుతుంది? ధర్మం వ్యక్తి కంటే వంశం ముఖ్యం అంటుంది. వంశ గౌరవం కోసం వ్యక్తులు జీవితాలను త్యాగం చేయాలి అంటుంది. వంశ వక్షం ఏ చిన్న ఆకు రాలిన అది అత్యంత సహజంగా జరగాలి తప్పిస్తే ఇతరేతర కారణాల వలన కాదు అంటుంది. ధర్మం ఇంత స్పష్టంగా వంశమే ముఖ్యం. వంశం అనే ఒక మహా ప్రవాహం లో వ్యక్తుల ఉనికి కేవలం బిందువంత. ఆ ప్రవాహం లేకుండా ఆ బిందువు కి అస్తిత్వమే లేదు. వంశాన్ని సంకరం చేసే, కలుషితం చేసే ఏ చర్యను తాను ప్పుకోను అంటాడు. కాత్యాయని మామగారి కోరికకి విరుద్ధంగా రాజారావును పెళ్లి చేసుకుంటుంది.
తన నాలుగేళ్ల కొడుకును తనకు ఇచ్చేయమని మళ్ళీ మామ గారిని అడిగితే అతడు యధావిధిగా ధర్మం ఏమి చెపుతుందో అదే చెప్తాడు. ఆమె పునర్వివాహం చేసుకున్నది కనుక ఇక ఎంత మాత్రమూ ఆమె చిన్ని కి మాతమూర్తి కాదని, కుటుంబంలో వున్నప్పుడే ఏ బంధానికి అయినా ధర్మబద్ధత ఉంటుందని అతడు చెప్తాడు. కొడుకు భర్త కుటుంబానికే చెందుతాడని, భర్త వంశాన్నే అతడు వద్ధి చేయాలనీ అతడు వివరిస్తాడు, అలా అని కొడుకు మీద ఆమెకు ఉన్న హక్కును కూడా అతడు నిరాకరించడు. నిర్ణయం ఆమెకే వదిలి వేస్తాడు. తన జీవితం లో రెండు అతి ముఖ్యమైన సందర్భాలలో తనదైన నిర్ణయం తీసుకున్న కాత్యాయని కొడుకు విషయంలో ఏమి చేస్తుంది?
ఆమె తన అంతరంగానికి విరుద్ధంగా ఆమె తనకొడుకు ను మామ గారి దగ్గరే వదిలివేసి వెళుతుంది. మాతత్వపు సలపరం మాత్రం ఆమెను జీవితాంతం వెంటాడుతూ, వేటాడుతూ ఉంటుంది. ఆమె చదువు పూర్తి చేసుకుని అధ్యాపకురాలిగా పని చేస్తున్న కళాశాల కే కొడుకు వస్తాడు. ఆమె తల్లి. గుర్తిస్తుంది. లక్కలా కరిగిపోతుంది. అతడు కొడుకు. రాయిలా మారిపోతాడు. తల్లిని నిరాకరిస్తాడు. ఆమె జీవితంలో గెలిచిందా? ఓడిపోయిందా?
చిత్రం ఏమిటంటే ఏ వంశవక్షం కోసం, ఏ ధర్మాచరణ కోసం తన జీవితాంతం పాటుపడ్డాడో శ్రీనివాస శ్రోత్రి ఆ శ్రీనివాస శ్రోత్రి పుట్టుకే ప్రశ్నార్ధకం? తన తాతకి పుట్టినవాడు తన తండ్రి కాదు అని తన తండ్రి అక్రమ సంతానం అని అతడికి తెలిస్తే అతడి ధర్మాచరణ మొత్తం ధర్మబద్ధమో? అధర్మబద్ధమో తెలియని విచికిత్సలో పడేస్తే, ధర్మం పేరు చెప్పి తన రెండవ భార్య లక్ష్మికి తను చేసిన అన్యాయం నిలువెత్తు ప్రశ్నలా ఎదుట నిలిస్తే శ్రీనివాస శ్రోత్రి గెలిచినట్టా? ఓడిపోయినట్టా?
నిజానికి వ్యక్తులుగా ఇది కాత్యాయని, శ్రీనివాస శ్రోత్రిల వైయక్తిక గెలుపు ఓటముల సమస్య మాత్రమేనా? వంశవక్షం అనే భావన కేవలం భావన మాత్రమే అది ఏ రకంగానూ నైతిక సూత్రాల చట్రంలో ఇమడదు? వెనక్కు వెనక్కు వెళ్లి, తరచి చూసుకుంటే మానవ జాతి మూలం అంతా ఒకటే, ఈ విశ్వమే ఒక పెద్ద వంశ వక్షం అనే తాత్వికత ఏమైనా దాగి ఉన్నదా? అన్నీ ప్రశ్నలే..
ఈ ప్రశ్నలకి సమాధానాలను ఎవరికీ వారు సినిమా చూస్తూ వేసుకుని తమకు తాము జవాబు పొందవలసిందే. నిజానికి ఇది ధర్మాచరణం, అధర్మవర్తనల సమస్య కూడా కాదు. ఒక నమ్మకం ఒక్కసారిగా కుప్పకూలితే ఏమి జరుగు తుందన్న విచికిత్స. శ్రీనివాస శ్రోత్రి డి ఒకటే నమ్మకం. తాను శ్రోత్రి వంశంలో పుట్టాను కనుక ఆ వంశ గౌరవాన్ని, పవిత్రతను కాపాడటం, పెంపొందించడం మాత్రమే తన పని. అంతకు మినహా తన జీవితానికి అర్ధమూ అస్తిత్వమూ లేదు. ఆ నమ్మకం తోనే అతడు ప్రతి పనిని ఆ వంశ గౌరవం కోసమే చేశాడు. కానీ తాను శ్రోత్రీ వంశవక్షంలో ఒక భాగం కాదని అతడికి ఇంకాస్త ముందు తెలిస్తే ఏమి జరిగి ఉండేది? అతడు కాత్యాయని నిర్ణయాలను సమర్ధించేవాడా? కాత్యాయని కొడుకును ఆమెకే ఇచ్చేవాడా? ఒక నమ్మకం గాయపడితే ఇక ముందు జీవితం ఎలా గడుస్తుంది? సామూహిక విశ్వాసాల నేపథ్యంలో వైయక్తిక జీవితాలు తుఫానులో చిగురుటాకుల్లా ఎలా వణికిపోతాయి అనే విషయాలను ఒక్కొక్క పోరా వలుచుకుంటూ వెళితే నవలా పఠనములోనూ సినిమా వీక్షణలోనూ కొంచెం కొంచెంగా అర్ధం అవుతూ మన మానసిక పరిధిని విశాలం చేస్తాయి. ఇది ఈ సినిమా అసలు లక్ష్యం.
ఈ సినిమాలో రెండు ప్రధాన పాత్రలు . ఒకటి శ్రీనివాస శ్రోత్రి, రెండు కాత్యాయని . కాత్యాయనిగా కన్నడంలో ఎల్వి శారద, తెలుగులో జ్యోతి, శ్రీనివాస శ్రోత్రిగా కన్నడంలో టి.వెంకట రావు, తెలుగులో జె.వి సోమయాజులు పోషించారు. నవలను యధాతధంగా కన్నడంలో అనుసరిస్తే, కన్నడ వెర్షన్ను యధాతధంగా తెలుగులో దించేశారు. కన్నడంలో గిరీష్ కర్నాడ్కి దర్శకుడుగా ఇది మొదటి సినిమా. ఈ సినిమాను అతడు బివి కారత్తో కలసి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తెలుగులో బాపు వంశవక్ష సమయానికే దర్శకుడుగా లబ్దప్రతిష్టుడు. కన్నడ, తెలుగు వెర్షన్స్ను సైమల్టేనియస్గా చూస్తూ దర్శకత్వ ప్రతిభను కంపేర్ చేసుకుంటూ మనదైన లోకంలోకి వెళ్లిపోవడం బావుంటుంది.
కన్నడంలో జాతీయ ఉత్తమ చలన చిత్రంతో పాటుగా బివి కారత్, గిరీష్కర్నాడ్లు సంయుక్తంగా ఉత్తమ దర్శకుడు పురస్కారాలు పొందారు. తెలుగులో ఉత్తమ దర్శకుడుగా బాపు ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమనటిగా జ్యోతి ఫిలింఫేర్ అవార్డు పొందారు. కన్నడ నటుడు విష్ణువర్ధన్ కి ఇది మొదటి సినిమా అయితే, అనిల్ కపూర్కి తెలుగులో ఇది మొదటి సినిమా.
- వంశీకృష్ణ, 9573427422