Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలి తెలుగు సినిమా టాకీ 1931లో 'భక్తప్రహ్లాద'తో ప్రారంభమైంది. అప్పటిదాకా మూకీ సినిమాలతో వీరవిహారం చేసిన తెలుగు సినిమా టాకీ చిత్రంతో తొలి అడుగు వేసింది. ఈ సినిమాలో తొలి సినిమా పాట రాసిన కవి చందాల కేశవదాసు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని జక్కేపల్లి వాసియైన కేశవదాసు నాటకరచనతో, అవధాన పద్యాలతో, కీర్తనలతో అప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించు కున్నాడు. కేశవదాసుపై ఉన్న అపారమైన గౌరవంతో ఆయన రాసిన భక్తప్రహ్లాద నాటకంలోని పాటను సినిమా కోసం వాడుకున్నారు. ఇది తెలుగు తెరపై తొలి సినిమా పాట..
''పరితాపభారంబు భరియింప తరమా
కటకట నేవిధి గడువంగ జాలుదు
పతియాజ్ఞను దాటగలనా?
పుత్రుని కాపాడగలనా?''
ఈ పాట చూడగానే మనకు సన్నివేశం కళ్ళ ముందు ఆవిష్క్రతమవుతుంది. లీలావతి భర్త హిరణ్య కశిపుడు ఆమెను ప్రహ్లాదునికి విషాన్ని ఆహారంగా ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఇలాంటి విషమ పరిస్థితిని భరించడం సాధ్యంకాక ఆమె ఎంతో దుఃఖిస్తుంది. విధి ఇలాంటి దుస్థితిలోకి తనను నెట్టివేసిందని చింతిస్తుంది. భర్త ఆజ్ఞను జవదాటడానికి సాహసం చేయని ఇల్లాలి పాతివ్రత్యాన్ని, కుమారుడైన ప్రహ్లాదుడిని కాపాడు కోవాలని తపించే తల్లి మమకారాన్ని రెండింటిని మనం ఈ పాట ద్వారా లీలావతిలో గమనించవచ్చు. భర్తపై గౌరవాన్ని, కుమారునిపై మమకారాన్ని నింపుకున్న లీలావతిలోని సందిగ్ధావస్థ ఈ పాటలో మనకు స్పష్టమవుతుంది.
తరువాత పంక్తుల్లో...
''ఈ విషము నేనెటులను
తనయుని త్రావింపగలను?
ధర్మము కాపాడుదునా
తనయుని కావగ గలనా?''
లీలావతి ఎటూ అర్థం కాని మానసిక స్థితిలో ఉంది. కుమారునికి తల్లియే విషం తాగించడం అనేది కనీవినీ ఎరుగని సంఘటన. తల్లే కుమారునికి విషం తాగించిందన్న విషయం తెలిసి భవిష్యత్ తరాలు నన్ను నిందిస్తాయంటూ బాధ పడుతుంది. అంతేకాదు ఇది భర్త విధించిన ఆజ్ఞ. ఇది ధర్మం. అలాంటి ధర్మాన్ని కాదని, భర్త మాటను తిరస్కరించిందన్న అపనింద కూడా భరించవలసి వస్తుందని తీవ్రమైన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇది ధర్మచింతన కలిగిన గొప్ప సందేశాత్మక గీతం.
ఈ పాట చిత్రీకరణ అంతా కూడా 1931 సెప్టెంబర్లో జరిగినట్లుగా పరిశోధ కుల విస్తృత కషి వల్ల తెలు స్తుంది. కాని పూర్తిపాట దొరకకపోవడం బాధా కరం. నాటకాల ఆధారం గానే సినిమాలు తీయడ మనేది ఈ సినిమాతోనే ప్రారంభమైంది. ఈ పాటలోని పదబంధాలు కూడా మనకు గ్రాంథిక శైలిలో కనబడతాయి. ఈ పాట కేశవ దాసుకున్న పాండిత్యాన్ని, సంప్రదాయ భాషాభిమానాన్ని చాటుతుంది. ఈ పాట కేశవదాసుకు మాత్రమే మొదటిపాట కాదు, తెలుగు సినిమాకే మొదటిపాట. ఇది ప్రత్యేకంగా పేర్కొనదగ్గ చారిత్రకమైన విషయం.
ఈ పాట సినిమాలో వచ్చిన తర్వాత బహుళ ప్రచారం పొందింది. సురభి నాట్యమండలి వారు ప్రదర్శించిన 'భక్త ప్రహ్లాద' నాటకంలో కూడా పదేపదే ఈ పాటను ఉపయో గించుకునేవారట. ఈ పాట మాత్రమే కాదు అత్యంత సుప్రసిద్ధ గీతమైన ''భలేమంచి చౌకబేరము.. ఇది సమయము మించినన్'' పాట కూడా ఆయన రాసిందే. ఈ పాట 1935లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన శ్రీకష్ణ తులాభారం సినిమా కోసం రాయబడింది. అయితే 1955, 1966 లలో మరో రెండు సార్లు శ్రీ కష్ణ తులాభారం సినిమాను తీసినప్పుడు కూడా ఈ పాటనే మళ్ళీ ఆ సినిమాల్లో ఉపయోగించుకున్నారు. అంతేకాదు ఈ పాట పేరుతో 2019లో ఒక సినిమా కూడా వచ్చిందంటే ఈ పాట ఎంత ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంకా చెప్పనవసరం లేదు.
ఇలాంటి పాటలతో రాబోయే పాటల రచయితలందరికి దిశానిర్దేశం చేశాడు. తొలి తెలుగు సినిమా పాట రాసి తెలుగుజాతికే గర్వ కారణమయ్యాడు.
- తిరునగరి శరత్ చంద్ర,6309873682