Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుంకిరెడ్డి నల్లగొండ జిల్లావాసి. కవి, విమర్శకుడు, తెలంగాణ చరిత్ర కారుడు. ఆయన కవిత్వంలో తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టాలనే ఆశావాహ దృక్పథం స్పష్టంగా కనబడుతుంది. గ్రామీణ జీవన విధానంలోని అంశాలు తన కవిత్వంలో వస్తువులుగా తీసుకొని జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తాడు.
ఆయన నిత్య అన్వేషి. ఆయనకు తెలంగాణ పదజాలంపై ఎంతో మక్కువ.ఆయన తన పుస్తకాలకు పెట్టిన శీర్షికలు ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తాయి.
''తావు''అంటే 'ఉనికి' అని 'అస్థిత్వమని' ఆధునికత ప్రభావం వల్ల ఆ పాత రోజులకు ఆపాత విధానాలకు స్వస్తి పల కాల్సి వచ్చిందన్న అంతరంగిక ఆవేదన నారాయణ రెడ్డి కవి త్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ ఉనికి, ఆ అస్థిత్వపు ఛాయలుండే స్థలాన్ని వెతుకులాటగా ''తావు''ను అభివర్ణించ వచ్చు. తావులో తాత్వికత కనిపిస్తుంది. విభిన్న కోణాల కవితాం శాలు ఆవిష్కరించబడ్డాయి. తెలంగాణ మాండలికాన్ని వాడు తూ సహజంగా కవితాత్మలోకి పాఠకున్ని తీసుకెళ్ళటం ఈయన ప్రత్యేకత.
వెంటాడే వాక్యాల్లోకి...
''కాకులు రాళ్ళు వేయకుంటనే
అంది వచ్చినట్టు
చెలిమెలుచెలిమెలుగా
మా వాగు'' (వాగు)
వాగు అనే కవితలో వాగు యొక్క పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వాగును కేవలం వ్యాపార కేంద్రంగా మార్చి ఆనవాళ్లు లేకుండా చేశారన్న విషయం చెబుతూ అప్పుడున్న వాగు సహజ లక్షణాన్ని వివరించే ఈ వాక్యాలు వెంటాడుతాయి. ఈ కవితలోనే నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుల బాధలను వివరిస్తూ ఆ వాగే నీరు నందిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నట్టుగా ఆవేదనను వ్యక్తం చేశారు.
''రోడ్లిప్పటి నదులు
తాము కదలకుంటనే మనల్ని కదిలించే
కొత్త రకం నదులు'' (రోడ్డు)
''రోడ్డు'' అనే కవితలో నదులున్న చోటే జనావాసం చక్కగా ఉండి మానవులు నాగరికతను సంతరించుకున్నారని చెబుతూ ''రోడ్లు'' ఇప్పుడు నదులై కొత్త నాగరికతకు అనుసంధానం చేస్తున్నాయని వివరించారు.
నదుల పక్కనే వర్తక కేంద్రాలు వర్థిల్లినట్టుగా రోడ్డుతో నేటి మానవ జీవన పరిస్ధితులు ముడిపడి ఉన్నాయని ఎంతో చక్కటి పోలిక చేస్తూ రోడ్లకి, నదులకు ముడిపెట్ట గలిగారంటే ఆయన భావుకత ఎంత లోతైనదో మనం గమనించవచ్చు.
''ముల్లు దిగిన పాదం
తమలపాకులా మాట్లాడదు
లాఠీ తలిగిన దేహం
తుమ్మెదలా మాట్లాడదు
అహంకారం శరాఘాతమైతే
అదిరిపడిన నేల
అంకుశమయి మాట్లాడుతుంది'' (ఎవరితో అన్నదే ముఖ్యం)
ఎవరి స్వభావం ఆధారంగా వారికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెబుతూ, పోరాట స్ఫూర్తిని పెంపొందించేలా ఈ కవితా పంక్తులను ఎంతో శక్తివంతంగా రాశాడు.మా భాషను వంక పెట్టేవాడెవడు. మా బాధ మాకుంటే ఏ రాగంలో పలకాలో చెప్పేవాడెవడంటూ ప్రశ్నిస్తూ? చురకలేసిన ఈ కవితా పంక్తులు ఇప్పటికీ,ఎప్పటికీ వెంటాడేవే.
''దశాబ్దాల మా నిరుద్యోగ నిర్నిద్ర కన్న
మా పోరల శూన్య దక్కుల కన్న
మా రైతుల స్వీయ ఉరిశిక్షల కన్న
కలనేతే మానేతన్నల ఉరితీత అవడం కన్న
మొనగానివా ఆ విగ్రహాలు'' (పోనీ..)
తెలంగాణ ఉద్యమంలో కవిగా తన వంతు పాత్రను పోషించి స్వరాష్ట్ర సాధనకు కషి చేశారు. ''మిలియన్ మార్చ్'' సందర్భంగా రాసిన ఈ కవితలో ''విగ్రహాల కూల్చివేత''ను సమర్థించిన తీరు గొప్పగా కనిపిస్తుంది. విచిత్రమేమిటంటే ఇప్ప టికీ ఈ వాక్యాల్లోని సారం నేటి స్థితిగతులకు అద్దం పడుతున్నది. నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల కష్టాలు ఇప్పటికీ మనముందున్న సవాల్లే.
''కవిత్వం ఎప్పుడు శాశ్వత ప్రతిపక్షం'' అంటూ సన్మానాల కోసం పరిగెత్తేది కవిత్వం కాదని వివరించారు. కవి, విమర్శ కుడు, నిత్య పరిశోధకుడైనటువంటి సుంకిరెడ్డి కవిత్వాన్ని ఆసాంతం పరిశీలిస్తే పరిశోధనాతత్వంతో కవిత్వం రాస్తాడా అన్న అనుమానం తలెత్తడం సహజమే. తావు లోని మరోకవిత ''టచ్ స్క్రీన్''లో ఆయన ''ఒళ్ళంతా కళ్ళేనని'' చెప్పిన మాటలు వాస్తవంగా నారాయణ రెడ్డి గారికే సరిపోతాయి. కవులు కవిత్వంలో పోలికలు, వర్ణనలని రకరకాల విధానాలను అవలం భిస్తారు. ఈయన కవిత్వం అంతర్లీనమై ఆలోచనలను రేకెత్తిం చేదై ఉంటుంది. సుంకిరెడ్డి కవితా వాక్యా లను పరిచయం చేసే క్రమంలో నాకు కొన్ని కొత్త కోణాలు దొరికి నట్టయింది. ఈ వాక్యాలతో ఎంతో ప్రేరణ నిచ్చిన ఉద్యమ కవి సుంకిరెడ్డికి నమస్క రిస్తూ ముగిస్తున్నాను.
- తండ హరీష్గౌడ్
8978439551