Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుదిబండి వెంకటరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఆరో కవిత సంపుటి వృద్ధాప్యం. గుదిబండి వెంకటరెడ్డి 79వ జన్మదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 79మంది కవులు రాసిన 79 కవితలతో వెలువడిన కవితా సంపుటి వద్ధాప్యం. ప్రభుత్వ సలహాదారులు డా.కె.వి.రమణ, డా.జె.చెన్నయ్య, ముదిగంటి సుజాతారెడ్డి గార్లు రాసిన ముందుమాటలతో ప్రఖ్యాత కవులైన కడారు వీరారెడ్డి,చలపాక ప్రకాష్,డా.తెన్నేటి సుధాదేవి, కొండపల్లి నీహారిణి, పొత్తూరు సుబ్బారావు,పెద్దూరి వెంకటరెడ్డి, రఘుశ్రీ, ఖాజామైనద్దీన్, సరికొండ నరసింహరాజు, ఎ.వి.జనార్ధనరావు, వడలి రాధాకష్ణ వంటి వారు రాసిన కవితలు ఆలోచింపచేస్తున్నాయి
వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పట్ల పిల్లల బాధ్యత, ఒంటరి తనం అనుభవించే ముసలివాళ్ల పట్ల సమాజం బాధ్యత, కడుపు తీపి చంపుకోలేని మాపై కాస్త కనికరం చూపెట్టమనే వేడుకోలు , నాటకంలో చివరి అంకంలా... జీవితంలో వద్ధాప్యమూ అంతే! ఆసరా కోసం ఎదురుచూసే చేతులు, పలకరింపు కోసం ఎదురుచూసే కళ్లు, జీవితానుభవాల మెలుకువలు ముందు తరాలకు అందించాలనే సందేశాలు, ఇలా ఎన్నో దశ్యాలను ఈ వద్ధాప్యం కవితా సంపుటి ఆవిష్కరించింది.
వృద్ధాప్యం (కవితా సంకలనం), గుదిబండ వెంకటరెడ్డి, పేజీలు: 82, వెల:100/-, ప్రతులకు : శ్రీమతి జి.భవానీరెడ్డి, బి70/ఎఫ్-1, పిఎస్.నగర్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -57, 9849882783.