Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో మహిళల వరల్డ్కప్పై నిర్ణయం
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐసీసీ ఇప్పటికే 2020 టీ20 వరల్డ్కప్ను వాయిదా వేసింది. 2023 వన్డే వరల్డ్కప్ షెడ్యూల్లో సైతం మార్పులు చేసింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ క్రికెట్ నిలిచిపోయింది. బయో సెక్యూర్ బబుల్లో క్రికెట్ జరుగుతున్నా ఐసీసీ వరల్డ్కప్ అర్హత టోర్నీలు ముందుకు సాగటం లేదు. దీంతో మెన్స్ క్రికెట్ వరల్డ్కప్ లీగ్2, అండర్19 క్రికెట్ వరల్డ్కప్ రీజినల్ క్వాలిఫయర్ డివిజన్ 2 టోర్నీలు వాయిదా పడ్డాయి. 2023 వరల్డ్కప్ అర్హత టోర్నీ లెవల్ 2 నమీబియాలో జరగాల్సి ఉంది. న్యూ గనియా, యునైటెడ్ నేషన్స్, నమీబియాలు పాల్గొనాల్సి ఉంది. అండర్19 వరల్డ్కప్ అర్హత డివిజన్ 2 ఆఫ్రికాలోని టాంజానియాలో చోటుచేసుకోవాల్సి ఉంది. కరోనా మహమ్మారితో ఈ రెండు టోర్నీలు జరిగేందుకు సురక్షిత పరిస్థితులు లేవని ఐసీసీ వాయిదా వేసింది. ఈ నెలలో శ్రీలంకలో జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్కప్ అర్హత టోర్నీ సైతం జరుగలేదు. దీనిపై త్వరలోనే ఐసీసీ ఓ నిర్ణయం తీసుకునే వీలుంది.