Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జాతి వివక్షపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
జొహనెస్బర్గ్ : ఆలస్యంగానైనా దక్షిణాఫ్రికా క్రికెట్లో నిర్మాణాత్మక అడుగులు పడుతున్నాయి. సుదీర్ఘ కాలం దక్షిణాఫ్రికా క్రికెట్ డ్రెస్సింగ్రూమ్లో భాగమైనా ఎల్లప్పుడూ ఒంటిరిగానే ఫీలయ్యాయని, జాతి వివక్ష కారణంగా టీమ్ బస్ను సైతం ఎక్కకుండా రన్ చేస్తూ స్టేడియానికి చేరుకునేవాడినని సఫారీ దిగ్గజ పేసర్ మకయా ఎన్తిని ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో భాగంగా ఇతర క్రికెటర్లు సైతం తాము ఎదుర్కొంటున్న జాతి వివక్ష అనుభవాలను వెల్లడించారు. దీంతో క్రికెట్ దక్షిణాఫ్రికా నిర్మాణాత్మక చర్యలు చేపడుతోంది. క్రికెటర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ పేరిటి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఏ శనివారం ప్రకటించింది. ఇందులో భాగంతో జాతి వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కారానికి స్వతంత అంబుడ్స్మన్ను నియమించనుంది. క్రికెటర్లను ఐక్యంగా ఉంచేందుకు మాజీ క్రికెటర్లతో మొదలుపెట్టి.. వారి అనుభవాలను తెలుసుకోనుంది. జాతి వివక్ష కారణంగా ఇబ్బందులు పడిన క్రికెటర్లు తిరిగి అవకాశాలు సాధించేందుకు రిస్టోరేషన్ ఫండ్ ఏర్పాటుతో సహాయం చేయనుంది. వైవిధ్యతను ప్రమోట్ చేసేందుకు క్రికెట్ వ్యవస్థలో నూతన కార్యక్రమాలు ప్రవేశపెట్టనుంది.