Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కివీస్ కోచ్, కెప్టెన్ల స్పష్టీకరణ
క్రైస్ట్చర్చ్ (న్యూజిలాండ్) : ఈ ఏడాది ఫిబ్రవరిలో వరల్డ్ నం.1 టెస్టు జట్టు టీమ్ ఇండియాపై న్యూజిలాండ్ టెస్టు సిరీస్ విజయం సాధించింది. అంతకముందు ఆస్ట్రేలియా పర్యటనలో కివీస్ దారుణ పరాజయం చవిచూసింది. దీంతో టెస్టు కెప్టెన్గా కేన్ విలియమ్సన్ను తొలగించాలనే చర్చకు పునాది పడింది. భారత్పై సిరీస్ విజయంతో ఆ చర్చకు ముగింపు పడింది. కానీ న్యూజిలాండ్ డ్రెస్సింగ్రూమ్లో చీఫ్ కోచ్ గ్యారీ స్టీడ్ కెప్టెన్సీ మార్పు ఆలోచనకు ఆజ్యం పోశాడని, కెప్టెన్ కేన్తో కోచ్తో పొసగటం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. కేన్ విలియమ్సన్ స్థానంలో టామ్ లేథమ్ను టెస్టు జట్టు కెప్టెన్గా చేసేందుకు స్టీడీ బలమైన అభిప్రాయాలు వెల్లడించానే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయ జట్టు కెప్టెన్, కోచ్ల మధ్య విభేధాల వార్తల నేపథ్యంలో ఇద్దరూ స్పందించారు. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. 2018 ఆగస్టులో కివీస్ కోచ్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన స్టీడ్ కాంట్రాక్టు అక్టోబర్లో ముగియనుంది. 'చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. క్రికెట్ న్యూజిలాండ్, క్రికెటర్లు జట్టు పురోగతికి నేను అవసరమని భావిస్తే.. కోచ్గా కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నాను. కేన్ విలియ్సన్తో నా బంధం ఎంతో బలమైనది. మేము ఎన్నోసార్లు ఆ విషయాన్ని చెప్పాం. పుకార్లలో ఎటువంటి వాస్తవం లేదు. ఇటువంటి వార్తలు నిరాశకు గురి చేస్తున్నాయి. మా మధ్య సానుకూల విభేదాలు మాత్రమే ఉన్నాయి. అది జట్టు మంచి కోసం జరిగే చర్చల్లోనే ఉంటుంది' అని స్టీడ్ అన్నాడు. ' గ్యారీతో నాది ఎంతో మంచి బంధం. మా ఇద్దరి మధ్య సవాళ్లలో నిజాయితీ ఉంటుంది. జట్టును ముందుకు నడిపించటంపై మా ఇద్దరి ఆలోచనలను స్పష్టంగా పంచుకుంటాం. ఏ సంస్థ నాయకత్వంలోనైనా చోటుచోసుకునే చర్చల వంటివే అవి. జట్టు కోసం నిజాయితీతో కూడిన సంభాషణలు మా మధ్య ఉండటం సానుకూల విషయం' అని కేన్ విలియమ్సన్ తెలిపాడు.