Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఐపీఎల్ 2019లో ఆడటంపై మోర్గాన్
సౌతాంప్టన్ : 2019 ప్రపంచకప్కు ముందు ఐపీఎల్ 12లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడటంపై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అగ్ర జట్టుగా కొనసాగుతున్నా ఇంగ్లాండ్కు వరల్డ్కప్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సుదీర్ఘ విరామం అనంతరం వరల్డ్కప్కు ఆతిథ్యం ఇస్తున్న ఇంగ్లాండ్ 2019లో కప్పు కొట్టేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు ఐపీఎల్ 12 సీజన్ వరల్డ్కప్కు ముందు కొంది రోజుల ముందు షెడ్యూల్ చేయబడింది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడాలా? వద్దా? అనే మీమాంస మొదలైంది. అయినా, ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు అందరూ ఐపీఎల్లో పాల్గొన్నారు. ఐపీఎల్లో ఆడటంపై ఎటువంటి అభ్యంతరం లేకపోయినా.. 2019 వరల్డ్కప్ ప్రణాళికల్లో ఐపీఎల్ ఓ భాగమని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తాజాగా వెల్లడించాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లేతో మాట్లాడుతూ మోర్గాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ' ఐపీఎల్ ఆడటం అండ్రూ స్ట్రాస్ (క్రికెట్ కమిటీ చైర్మన్) వ్యూహం. ఆ నిర్ణయం తీసుకునేలా నేను ఒత్తిడి చేశాను. ద్వైపాక్షిక సిరీస్లో చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్కప్ ఒత్తిడిని చూడలేం. ఐపీఎల్లో విదేశీ ఆటగాడిపై భిన్నమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచనాల నుంచి తప్పించుకోలేం. ఈ పరిస్థితి ఆటగాళ్లను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది. ఐపీఎల్లో ఆడటం పూర్తి ప్రయోజనం. క్రికెటర్ల మానసిక స్థితిని మార్చుతుంది. యువ క్రికెటర్లను తీర్చిదిద్దుకుంటూ భారత క్రికెట్ సైతం ప్రయోజనం పొందుతుంది' అని మోర్గాన్ అన్నాడు.