Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ క్రికెట్ చాంపియన్షిప్ ఏర్పాటు
- సౌత్ జోన్ మెంటార్గా సునీల్ బాబు
హైదరాబాద్: లండన్కు చెందిన సెవెన్ 3 స్పోర్ట్ కంపెనీ ఇండియాలో తొలిసారి 'క్లబ్ క్రికెట్'ను ప్రవేశపెట్టబోతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని క్లబ్ క్రికెట్ మోడల్ను అమలు చేయనుంది. క్రికెట్పై ఆసక్తి ఉన్న పాఠశాల విద్యార్థులు, యువకులకు ప్రోత్సహించేందుకు, సత్తా నిరూపించేందుకు జూనియర్ క్రికెట్ చాంపియన్షిప్ (జేసీసీ) నిర్వహించనుంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా 8 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారిలో ప్రతిభను గుర్తించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కోచ్లతో ట్రెయినింగ్ ఇవ్వనుంది. రిజిష్టర్ చేసుకున్న చిన్నారులను టాలెంట్ హట్ ద్వారా పరీక్షిస్తుంది. అనంతరం ఆయా ప్రాంతాల వారిగా ఏర్పాటు చేసే క్లబ్స్లో వారిని చేర్చి..వివిధ దశల్లో జరిగే జెసీసీలో ఆడే అవకాశం కలిపిస్తుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 65 నగరాల్లో వంద క్లబ్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రక్రియను పలువురు ప్రముఖులు పర్యవేక్షిస్తారు. భారత మాజీ క్రికెటర్ చేతన్ శర్మ సెంట్రల్ జోన్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. సౌత్ జోన్ మెంటార్గా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఫౌండర్ సెక్రటరీ కె. సునీల్ బాబు నియమితుడయ్యాడు. మాజీ ఆటగాళ్లు అశోక్ మల్హోత్రా, సురీందర్ ఖన్నా, సంజరు భరద్వాజ్ ఇతర జోన్లను పర్యవేక్షిస్తారు. చిన్నారులు, టీనేజర్లకు ఇది సువర్ణావకాశమని సునీల్ బాబు అన్నాడు. టాలెంట్ హంట్ నిర్వహణతో ప్రతిభ కలిగిన యువ క్రికెటర్లు వేలాదిగా వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. త్వరలో మొదలయ్యే జేసీసీలో పాల్గొనాలకునే వాళ్లు (8 నుంచి 18 ఏళ్లు) https://jcc-india.com/register/register-discount.php లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, ఇతర వివరాలకు ష్ట్ర్్జూర://jషష-ఱఅసఱa.షశీఎ సైట్ను చూడాలని సూచించాడు.