Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-2008 ఆసీస్ పర్యటనపై కుంబ్లే
చెన్నై : ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద టెస్టు మ్యాచ్ 2008 సిడ్నీ పోరు. సిడ్నీ టెస్టులో కంగారూ ఆటగాడు అండ్రూ సైమండ్స్ను కోతి అన్నాడనే ఆరోపణలతో హర్భజన్ సింగ్పై మూడు మ్యాచుల నిషేధం పడింది. అంపైరింగ్ నిర్ణయాలు సైతం భారత్కు వ్యతిరేకంగా వచ్చాయి. పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకుని స్వదేశానికి రావాలనే డిమాండ్ వినిపించినా.. జట్టు సిరీస్లో చివరి రెండు టెస్టుల్లో ఆడింది. అందుకు గల కారణాలను రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానల్లో అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు. ' కెప్టెన్గా సహజంగా మైదానంలో నిర్ణయాలు తీసుకుంటాం. కానీ మైదానం వెలుపల నిర్ణయం తీసుకునే పరిస్థితిని నేను చవిచూశాను. క్రికెట్ ప్రయోజనాలను ప్రభావితం చేయగల నిర్ణయమది. జట్టుగా మేము ఒక్కటిగా ఉన్నాం. జట్టు వెనక్కి రావాలనే చర్చ బాగానే వినిపించింది. ఒకవేళ మేము పర్యటన రద్దు చేసుకుని స్వదేశానికి వస్తే.. నిజంగానే భారత్ ఏదో తప్పు చేసిందనే వాదనకు బలం చేకూరేది. కెప్టెన్గా, జట్టుగా మేము సిరీస్ నెగ్గేందుకే అక్కడికి వెళ్లాం. తొలి రెండు మ్యాచుల ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. మిగతా రెండు మ్యాచుల్లో నెగ్గితే.. ఉత్తమ ఫలితం డ్రా సిరీస్. జట్టుగా మేము ఆడేందుకు నిర్ణయించుకున్నాం. తర్వాతి మ్యాచుల్లో విజయాలతో అభిమానులకు అత్యుత్తమ సందేశం ఇవ్వాలనుకున్నాం' అని కుంబ్లే అన్నాడు. అనిల్ కుంబ్లే 14 టెస్టులకు సారథ్యం వహించాడు. అందులో 3 విజయాలు, ఆరు ఓటములు, ఐదు డ్రాలు ఉన్నాయి.