Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎం.ఎస్ ధోనిపై ఆశీష్ నెహ్రా
న్యూఢిల్లీ : బయో సెక్యూర్ బబుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యుఏఈ నుంచి మెరిసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. 2019 వరల్డ్కప్ సెమీఫైనల్స్ తర్వాత, మళ్లీ మైదానంలో అడుగుపెట్టని దిగ్గజ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని ఈ ఐపీఎల్ సీజన్లో చర్చనీయాంశం కావాలి కానీ ఈ ఐపీఎల్తో ధోని కెరీర్ ఏమాత్రం ప్రభావితం కాలేదని మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా అన్నాడు. ' నాకు తెలిసి, ధోని ఆట ఎప్పుడూ కిందకు పడిపోలేదు. జట్టును ఎలా నడపాలో, యువ క్రికెటర్లను ఎలా ముందుకు నడిపించాలో అతడికి తెలుసు. ఒకే విషయాన్ని పదేపదే ప్రస్తావించలేను. కానీ ఐపీఎల్ సీజన్ ఎం.ఎస్ ధోని కెరీర్ను ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ధోని ఎంపికకు ఐపీఎల్ సీజన్ ప్రామాణికం కాకూడదు. ఐపీఎల్ కేవలం ధోనిపై చర్చకు ఓ అంశమే. ధోని ఆడేందుకు సిద్ధంగా ఉంటే జట్టులో ఉండాల్సిన తొలి ఆటగాడు అతడే. నాకు తెలిసి ఎం.ఎస్ ధోని భారత్ తరఫున తన చివరి మ్యాచ్ సంతోషంగా ఆడేశాడు' అని నెహ్రా అన్నాడు.
అతడు వద్దు! : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సెలక్షన్స్లో కెప్టెన్ ఎం.ఎస్ ధోని పాత్ర కీలకం. ఆ జట్టు యజమాని ఎన్. శ్రీనివాస్ ఓ విషయాన్ని తాజాగా పంచుకున్నాడు. ఓ అద్భుతమైన క్రికెటర్ను చెన్నై సూపర్ కింగ్స్లోకి తీసుకోవాలని ధోనికి శ్రీనివాసన్ చెప్పగా.. మహి ఇలా బదులిచ్చాడట. ' వద్దు సర్. ఆ క్రికెటర్ జట్టు సమగ్రతను కలుషితం చేస్తాడు. అమెరికన్ ప్రాంఛైజీ తరహా వ్యవస్థ ఇప్పటికీ బలోపేతంగా ఉండటానికి కారణం జట్టు సమగ్రత, సమష్టితత్వం' అని ధోని అన్నాడని శ్రీనివాస్ గుర్తు చేశాడు.