Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మహిళల క్రికెట్పై అంజుమ్ చోప్రా
యుఏఈలో ఐపీఎల్ 2020 నిర్వహిస్తున్నామని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బీసీసీఐ ప్రకటించింది. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. కరోనా కష్టకాలంలో ఐపీఎల్ ఆదాయం నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న ఓ నిర్ణయంపై ఇప్పుడు వివాదం రేగుతోంది. ప్రజలను చైనా ఉత్పత్తులు వాడొద్దని పిలుపునిచ్చిన ప్రభుత్వం, ఐపీఎల్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని సోషల్ మీడియా మండిపడుతోంది. పెరుగుతున్న వ్యతిరేకత, అమ్మకాల్లో ప్రతికూలత నడుమ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు వదులుకునేందుకు వివో సిద్ధమవుతోంది!.
న్యూఢిల్లీ : మహిళల క్రికెట్ అభివృద్ధి పట్ల బీసీసీఐ ఆలోచనలు చేస్తుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు, కానీ మహిళల క్రికెట్ పట్ల సమాచారంలో స్పష్టత అవసరమని భారత మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత అంజుమ్ చోప్రా అన్నారు. ' మహిళల క్రికెట్ గురించి బీసీసీఐ ఆలోచించటం లేదు అనేది కాదు. మహిళల క్రికెట్ పట్ల బోర్డు మరింత స్పష్టమైన సమాచారం అందించాలి. పురుషుల క్రికెట్లో ఉన్నంత స్పష్టత మహిళల క్రికెట్లో లేదు. మహిళల క్రికెట్ పతాక శీర్షికలకు ఎక్కటం బాధాకరం. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ భాగం కావాల్సింది. కానీ మహిళల ఐపీఎల్ ఆడుతుండటం సంతోషకరం. ఏదో ఒక విధంగా 2021 వరల్డ్కప్కు అమ్మాయిలు సన్నాహకం అవగలుగుతారు. ఓ టోర్నీకి దూరం కావటం మంచిది కాదు, కానీ లాజిస్టకల్ సమస్యలు, సన్నద్ధంగా లేని జట్టును పంపించటం సరైన నిర్ణయం కాదు' అని చోప్రా అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ 2020 కోసం మరో ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ల మూడు టీ20ల సిరీస్ అక్టోబర్ 4, 6, 9న జరగాల్సి ఉంది. ఐపీఎల్ షెడ్యూల్కు మార్గం సుగమం చేసేందుకు సీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కోవిడ్19 మహమ్మారి కారణంగా విండీస్తో టీ20 సిరీస్ వాయిదా వేస్తున్నట్టు సీఏ వెల్లడించింది. దీంతో ఐపీఎల్కు ఆటంకం ఉండబోదు.
ఇంగ్లాండ్ వరుసగా మరో టెస్టు సవాల్కు సిద్ధమవుతోంది. వెస్టిండీస్పై 2-1తో విజ్డెన్ సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్.. పాకి స్థాన్తో తొలి టెస్టు ఆడనుంది. సిరీస్ విజయంతో ఇంగ్లాండ్ జోరుమీదుండగా.. అనిశ్చితితో కూడిన పాకిస్థాన్ ఎప్పట్లాగే బరిలోకి దిగుతోంది. మ.3.30 నుంచి మ్యాచ్ సోనీసిక్స్లో ప్రసారం అవుతుంది.