Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల వరల్డ్ కప్ పోటీలు 2022కు రీషెడ్యూల్
- స్పష్టం చేసిన ఐసీసీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో క్రీడా పోటీల షెడ్యూళ్లు తారుమారవుతున్నాయి. ఐపీఎల్ వంటి భారీ క్రికెట్ సంరంభం సైతం దేశం వెలుపల జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, మెగా క్రికెట్ ఈవెంట్లపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. ముందు నిర్దేశించిన ప్రకారం 2021లో జరగాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్ భారత్లోనే జరుగుతుందని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఆసీస్ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 పురుషుల వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలోనే 2022లో జరుగుతుందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వ్యాప్తిని దష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి వివరించింది. ఇక, న్యూజిలాండ్ లో వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల వరల్డ్ కప్ పోటీలను 2022కి రీషెడ్యూల్ చేశారు.