Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్13 స్పాన్సర్షిప్లపై బీసీసీఐ
ముంబయి: కరోనా కష్టకాలం. మార్కెట్లో ఎన్నడూ లేనంత అనిశ్చితి. ఈ పరిస్థితుల్లో మార్కెట్ నుంచి స్పాన్సర్షిప్లను ఆకర్షించటం మామూలు విషయం కాదు. కానీ ఆర్థిక సవాళ్లు ఎదురైన ప్రతిసారీ అద్భుత ఫలితాలే రాబట్టిన బీసీసీఐ, మరోసారి అటువంటి వండర్ ఫలితాన్ని ఆశిస్తోంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా స్మార్ట్ఫోన్ మొబైల్ కంపెనీ వివో తప్పుకోవటంతో ఈ సీజన్కు బీసీసీఐ రూ.440 కోట్ల ఆదాయం కోల్పోనుంది. నాలుగు నెలల పాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా కొనసాగేందుకు ఇటీవల బీసీసీఐ ఆసక్తి వ్యక్తికరణ బిడ్లు ఆహ్వానించింది. ఆగస్టు 14న బిడ్లను తెరవనున్నారు. టైటిల్ స్పాన్సర్షిప్కు రూ.200-240 కోట్లను బోర్డు ఆశిస్తోంది. ఇవి కాకుండా, ఐపీఎల్ స్పాన్పర్షిప్ల విభాగంలో 2-3 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 2 స్పాన్సర్షిప్లకు బిడ్లు ఆహ్వానించాలని బీసీసీఐ యోచిస్తోంది. మరో రెండు స్పాన్సర్షిప్లతో రూ.60-80 కోట్లు రాబట్టవచ్చని బోర్డు ఆలోచన. ఓవరాల్గా రూ.300 కోట్లు రాబట్టినా.. ఈ పరిస్థితుల్లో రూ.140 కోట్ల నష్టం పెద్ద విషయం కాదు (వివో ఇచ్చే సొమ్ముతో పోల్చినప్పుడు). ఐపీఎల్ అధికారిక భాగస్వాములు టాటా మోటార్స్, ఎఫ్బిబి, డ్రీమ్11లు రూ. 120 కోట్లు, అంపైర్ స్పాన్సర్ పేటీఎం రూ.28 కోట్లు, వ్యూహాత్మక టైమౌట్ భాగస్వామి సీయెట్ రూ.30 కోట్లు ప్రతి సీజన్కు చెల్లిస్తాయి.