Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్స్ జరగాల్సిందే.. జపాన్మంత్రి వ్యాఖ్య
టోక్యో : కరోనా వైరస్ కారణంగా వాయిదాపడ్డ టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఎలాగైనా జరగాల్సిందేనని ఆ దేశ క్రీడలమంత్రి సేకో హషిమోతో స్పష్టంచేశారు. జపాన్టైమ్స్ రిపోర్టు ప్రకారం.. మంత్రి హషిమోను మీడియా ప్రతినిధులు కలిశారు. ఒలింపిక్స్ క్రీడలు తాత్కాలికంగా వాయిదా పడ్డా.. ఏర్పాట్లు మొదలుకుని క్రీడల్లో తమ సత్తా చాటడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న క్రీడల్లో పాల్గొనటానికి అధ్లెట్స్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఆ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేలా చురుకుగా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి వివరించారు. కరోనా వైరస్ను కట్టడి చేస్తూనే మరోవైపు ఒలింపిక్స్ నిర్వహణ వైపు ప్రత్యేకంగా దృష్టికేంద్రీకరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్.19 ఉన్నా లేకపోయినా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాల్సిందేననిఅంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ)ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ చెప్పారు. దీనికి మరింత బలం చేకూర్చేలా జపాన్ మంత్రి పై విధంగా స్పందించారు. భౌతికదూరం,మాస్కులు ధరించిన ప్రేక్షకుల మధ్య క్రీడలు నిర్వహణకు ప్రపంచంలోని పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈనేపథ్యంలో వచ్చేఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు షురూ కానున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది జులై..ఆగస్టు మధ్యలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కావాల్సిఉన్నది. కానీ కరోనా వైరస్ విజృంభించటంతో..ఒలింపిక్స్ క్రీడాపోటీలను వచ్చే ఏడాది వరకు వాయిదా వేసిన విషయం విదితమే.