Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఏఈ చేరుకున్న కరీబియన్లు
దుబాయ్ : కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో టైటిల్ విజయం అందుకున్న కరీబియన్ స్టార్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కోసం యుఏఈకి చేరుకున్నాడు. సీపీఎల్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ను పొలార్డ్ టైటిల్ విజేతగా నిలిపాడు. సీపీఎల్ ముగియటంతో కరీబియన్ క్రికెటర్లతో పాటు ఇతర దేశాల క్రికెటర్లు సైతం ఐపీఎల్ కోసం యుఏఈకి చేరుకున్నారు. ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న కీరన్ పొలార్డ్, రూథర్ఫోర్డ్లు అబుదాబికి చేరుకున్న ఫోటోలను ఆ ప్రాంఛైజీ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్తో మూడుసార్లు చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ తలపడనున్న సంగతి తెలిసిందే.