Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్ ప్రాక్టీస్కు ఇబ్బందులు
హైదరాబాద్ : సరిహద్దు ఉద్రిక్తతలు, ప్రజల్లో భావోద్వేగాల పేరుతో పొరుగు దేశం చైనా నుంచి దిగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణ యం క్రీడా రంగంపై ప్రభావం చూపుతోంది. బ్యాడ్మింటన్ షటిల్స్ ఉత్పత్తి 90 శాతం చైనాలోనే జరుగుతుంది. ఫెథర్ షటిల్స్ను భారత్ పెద్ద మొత్తంలో చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. లాక్డౌన్, అనంతరం చైనా దిగుమతులపై నిషేధం కారణంగా బ్యాడ్మింటన్లో ఇబ్బందులు మొదల య్యాయి. బ్యాడ్మింటన్ శిక్షణలో షటిల్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. చైనా దిగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.., ప్రత్యామ్నాయ మార్గాలను విస్మరిం చింది. దీంతో రానున్న థామస్, ఉబర్ కప్ శిక్షణ శిబిరానికి సైతం ఇబ్బందులు తప్పవని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ' థామస్, ఉబర్ కప్ క్యాంప్కు షటిల్స్ ఇంకా రాలేదు. మా వద్ద ఉన్న వాటితోనే ఆడుతున్నాం. షటిల్స్ను త్వరలో పంపకుంటే, సాధనపై ఇది ప్రభావం చూపనుంది' అని పుల్లెల గోపీచంద్ అన్నారు.