Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత డీన్ జోన్స్(59) గుండెపోటుతో కన్నుమూశారు. సీజన్-13 ఐపిఎల్లో భాగంగా బ్రాడ్కాస్టింగ్ వ్యవహారాల్లో నిమగమైన జోన్స్.. ముంబయిలోని ఓ హోటల్లో గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. డీన్ జోన్స్ మృతికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, సచిన్, గంగూలీ తదితరులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలిపారు. 'జోన్స్ మరణవార్త విని షాక్కు గురయ్యానని, అతని కుటుంబ, స్నేహి తులకు మనోధైర్యంతో ఉండాలని' కోహ్లీ ట్వీట్ చేశాడు. 1984-1992మధ్య కాలంలో ఆసీస్ తరఫున 52 టెస్టుల్లో 3,631 పరుగుల చేయడంతోపాటు 11 సెంచరీలను చేశారు. ఇక 164 వన్డేల్లో 6,063 పరుగులతోపాటు 7 సెంచరీలు, 46 అర్ధసెంచరీలను చేశారు. 1986-87లో భారత్తో జరిగిన టెస్టు మ్యాచ్లో జోన్స్ 210 పరుగులు చేశారు. జోన్స్ వీరోచిత బ్యాటింగ్తో ఆసీస్ ఓడిపోయే టెస్టు మ్యాచ్ను టైగా ముగించారు. జోన్స్ తన ఫస్టక్లాస్ కెరీర్లో 51.85 సగటుతో 19,188 పరుగులు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్కు 1992లో టెస్టులకు, 1994లో వన్డేలకు గుడ్బై చెప్పారు.
రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్ గా..
రిటైర్మెంట్ అనంతరం డీన్ జోన్స్ కామెంటే టర్గా మారారు. ఆస్ట్రేలియా తరఫున కామెంట్రీ ప్యానెల్లో చోటు దక్కించుకోవడంతో పాటు ఐపిఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ కామెంటేటర్గా కొనసాగుతున్నారు. 'జోన్స్ ఇకలేరు. ఇది చాలా విషాదకరమైన ఘటన. ఈ వార్తను షేర్ చేయడం కలిచి వేస్తోంది. తీవ్ర గుండెపోటు రావడంతో జోన్స్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆయన మృతికి నివాళులర్పిస్తున్నాం. జోన్స్ మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జోన్స్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దక్షిణాసియాలో క్రికెట్ అభివృద్ధికి జోన్స్ ఎంతో కృషి చేశారు. యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే వారు. కామెంటరీలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఆయన కామెంటరీకి లక్షలాది అభిమానులున్నారు' అని స్టార్స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.