Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎట్టకేలకు నియమించిన బీసీసీఐ
ముంబయి : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పడకేసిన మహిళల క్రికెట్కు ఎట్టకేలకు నూతన సెలక్షన్ కమిటీ వచ్చేసింది. హేమలత కళ సారథ్యంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ స్థానంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం నూతన కమిటీని నియమించింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. నీతూ డెవిడ్ మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా నియమితులు కాగా.. ఆర్తి వైద్య, రేణు మార్గేట్, వెంకటాచర్ కల్పన, మిథు ముఖర్జీలు సెలక్షన్ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. చీఫ్ సెలక్టర్ నీతూ డెవిడ్ భారత్కు పది టెస్టులు, 97 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించారు. ఆర్తి వైద్య 3 టెస్టులు, 6 వన్డేలు.. రేణు 5 టెస్టులు, 23 వన్డేలు... కల్పన 3 టెస్టులు, 8 వన్డేలు, మిథు 4 టెస్టుల అనుభవం కలిగి ఉన్నారు. సెలక్షన్ కమిటీలో సీనియారిటీ ప్రకారం నీతూ డెవిడ్ చీఫ్ సెలక్టర్గా వ్యవహరిస్తారని బీసీసీఐ తెలిపింది. మహిళల క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాల రికార్డు నీతూ పేరిటే ఉంది. ఇంగ్లాండ్తో జెంషెడ్పూర్ టెస్టులో(1995) నీతూ ఓ ఇన్నింగ్స్లో 8/53తో చెలరేగింది. భారత్ తరఫున 100 వికెట్లు కూల్చిన బౌలర్ నీతూ.. ఇప్పుడు వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్లలో చీఫ్ సెలక్టర్ (141 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నారు.