Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు రాయల్స్తో పంజాబ్ ఢీ
- రంగంలోకి జోశ్ బట్లర్
- రాత్రి 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
షార్జా (యుఏఈ) : 33 సిక్సర్లు, 18 ఫోర్లు.. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్లో నమోదైన బౌండరీలు ఇవి. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు ఇవే. చిన్న స్టేడియం, పొట్టి బౌండరీలతో కూడిన షార్జా తొలి మ్యాచ్లో 40 ఓవర్లలో 416 పరుగులు నమోదవగా.. నేడు రాజస్థాన్, పంజాబ్ మ్యాచ్లోనూ అదే స్థాయిలో పరుగుల విన్యాసం ఉంటుందని చెప్పవచ్చు. రెండు జట్లూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్పై 97 పరుగుల భారీ విజయంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జోరుమీదుంది. ఆ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ అజేయ 132 పరుగుల శతకంతో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ దిగ్గజ జట్టు చెన్నై సూపర్కింగ్స్ పై సాధికారిక విజయంతో రాజస్థాన్ రాయల్స్ గొప్పగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్లో ఆడలేని జోశ్ బట్లర్ నేడు మైదానంలో అడుగుపెట్టనున్నాడు. యువ కెరటం సంజు శాంసన్కు జోశ్ బట్లర్ తోడైతే రాయల్స్ను పరుగుల వేటలో నిలువరించటం అంత సులువు కాదు. పచ్చిక లేని షార్జా పిచ్పై స్పిన్నర్లకు ఏమాత్రం సహకారం లభించటం లేదు. మహ్మద్ షమి కెరీర్ ఫామ్లో విజృంభిస్తున్నాడు. పరుగుల పిచ్పైనైనా అతడిని ఎదుర్కొవటం రాయల్స్ సవాల్తో కూడిన పనే. పంజాబ్కు సైతం ఇక్కడ జోఫ్రా ఆర్చర్ను ఆడటం కష్టతరమే కానుంది. ఇక్కడ ఆడిన అనుభవంతో నేడు పంజాబ్పై రాజస్థాన్ మ్యాచ్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.