Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహి క్రికెట్ దిగ్గజం : సంజు శాంసన్
దుబాయ్ : ఐపీఎల్ 2020లో షార్జా వేదికగా సిక్సర్ల తుఫాన్ సృష్టిస్తున్న సంజు శాంసన్ను భారత క్రికెట్లో మరో ఎం.ఎస్ ధోని అంటూ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు గౌతం గంభీర్ ప్రతిస్పందిస్తూ.. భారత క్రికెట్లో సంజు శాంసన్.. సంజు శాంసన్లానే గుర్తుండిపోతాడని, ఎవరీ తర్వాత ఉండాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ట్వీట్ చేశాడు. తాజాగా మహితో పోలికలపై సంజు శాంసన్ స్పందించాడు. ' ఎం.ఎస్ ధోనిలా ఆడటం, ఎం.ఎస్ ధోనిలా ఆడాలని అనుకోవటం ఎవరి తరం కాదు అని నా నమ్మకం. ఎం.ఎస్ ధోని మాదిరిగా ఆడటం అంత సులువు కాదు. అందుకే అది పక్కకుపెట్టండి. నేను ఎన్నడూ ధోనిలా ఆడాలని అనుకోలేదు. అతడు భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. నా ఫోకస్ అంతా నా ఆటపైనే. నేను ఆడుతున్న జట్టును గెలిపించేందుకు ఏం చేయగలను అనే అంశంపైనే నా ఫోకస్. ఐపీఎల్లో వరుస ఇన్నింగ్స్లతో జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించానో లేదు తెలియదు. కానీ ఇప్పుడు నేను ఆటను ఆస్వాదిస్తున్నాను. నేను మంచి ఫామ్లో ఉన్నాననే విషయం మాత్రం అర్థమవుతోంది' అని సంజు శాంసన్ అన్నాడు. షార్జాలో తొలుత చెన్నై సూపర్కింగ్స్పై చిచ్చరపిడుగులా చెలరేగిన సంజు శాంసన్.. రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై రికార్డు ఛేదనలో (223) విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే.