Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్
ఒడెన్సె (డెన్మార్క్): ఏడు నెలల కరోనా మహమ్మారి విరామం అనంతరం షటిల్ కోర్టులో అడుగుపెట్టిన కిదాంబి శ్రీకాంత్.. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో సునాయాస విజయం సాధించిన పురుషుల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1.. ప్రీ క్వార్టర్స్లో మరింత సులువుగా గెలుపొందాడు. కెనడా షట్లర్ జేసన్ ఆంటోనిపై 21-15, 21-14తో కిదాంబి శ్రీకాంత్ వరుస గేముల్లో గెలుపొందాడు. 33 నిమిషాల ప్రీ క్వార్టర్స్లో శ్రీకాంత్కు ఎదురేలేదు. శ్రీకాంత్ 42 పాయింట్లు సాధించగా.. జేసన్ ఆంటోని 29 పాయింట్లకే పరిమితం అయ్యాడు. తొలి గేమ్లో విరామ సమయానికి 11-8తో ముందంజలో నిలిచిన శ్రీకాంత్.. ద్వితీయార్థంలో మరింత దూకుడుగా దూసుకుపోయాడు. రెండో గేమ్లో విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో నిలిచిన కిదాంబి.. వరుస పాయింట్లతో చెలరేగాడు. పాయింట్ల పరంగా ఆంటోని చేరువగా వచ్చినట్టు కనిపించినా.. శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. నేడు జరిగే క్వార్టర్ఫైనల్స్ పోరులో రెండో సీడ్ చైనీస్ చైపీ షట్లర్ చో చెన్తో శ్రీకాంత్ పోటీపడనున్నాడు. వరల్డ్ నం.2 చైనీస్ తైపీతో ముఖాముఖి పోరులో శ్రీకాంత్ 1-5తో వెనుకంజలో కొనసాగుతున్నాడు. నేటి మ్యాచ్లో వరల్డ్ నం.14 శ్రీకాంత్ లెక్క కాస్త మెరుగు పరుస్తాడేమో చూడాలి.