Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తొలిసారి జరగనున్న జాతీయ త్రో ఛాంపియన్షిప్ పోటీలు వచ్చే నెలకు వాయిదాపడ్డాయి. రీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 26, 27 తేదీల్లో పాటియాలా వేదికగా జరగాల్సిన పోటీలను వాయిదా వేస్తున్నట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఎఫ్ఐ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రెండురోజులపాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలలనుంచి క్రీడాకారులు హాజరుకావాల్సి ఉంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం, అథ్లెట్ల ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఎఫ్ఐ పేర్కొంది. అలాగే చీఫ్ కోచ్లు, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్లు, కోచ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరూ బయల్దేరవద్దని ఎఎఫ్ఐ అధ్యక్షులు అదిల్లే-జె-సుమరివాలా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం గత నెలలో జరగాల్సిన ఈ పోటీలో కోవిడ్-19 కారణంగా ఈ నెలాఖరుకు వాయిదాపడ్డాయి. జాతీయ యూత్ ఛాంపియన్ షిప్ జోనల్ ఈవెంట్స్ నవంబర్లో విజయవాడ వేదికగా జరగాల్సి ఉంది.