Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో ప్రవీణ్ దూబేను తీసుకోనుంది. గాయం కారణంగా ఈ సీజన్ ఐపిఎల్కు దూరమైన 37 ఏళ్ల మిశ్రా స్థానాన్ని కర్ణాటకకు చెందిన లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబేతో భర్తీ చేశారు. ఇప్పటికే యుఏఇలో ఉన్న దూబే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నెట్ బౌలర్గా ఉన్నాడు. అక్టోబర్ 3న కోల్కతాతో మ్యాచ్ సందర్భంగా మిశ్రా వేలికి గాయమైంది. దీంతో అతడు ఈ సీజన్ ఐపిఎల్కు ఢిల్లీకి దూరమయ్యాడు. 27ఏళ్ల దూబేను 2016 వేలంలో బెంగళూరు రూ.35 లక్షలకు కొనుగోలు చేసింది. అతడు బెంగళూరు కోసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రెండు సీజన్ల తర్వాత దూబేను బెంగళూరు ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. కర్ణాటక ప్రిమియర్ లీగ్(కెపిఎల్)లో దూబే చక్కని ప్రతిభ చూపాడు. 2015-16 కెపిఎల్ సీజన్లో బెళగావి పాంథర్స్ తరపున ఆడిన దూబే 6.89 యావరేజ్తో 8 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు తీశాడు. 2017-18 సీజన్లో తమిళనాడుతో జరిగిన టీ20లో 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అదే అతడి అత్యుత్తమ ప్రదర్శన. అలాగే వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషబ్ పంత్ కూడా గాయంతో ఢిల్లీ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.