Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు
- డిసెంబర్లో ఎన్నికలు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అధ్యక్ష పదవి రేసులో ఇద్దరు నిలిచారు. న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్కే మరియు సింగపూర్కు చెందిన ఇమ్రాన్ ఖవాజా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరు పోటీలో నిలవడంతో ఐసిసి డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించనుంది. బార్కేకు భారత్తోపాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెట్బోర్డులనుంచి మద్దతు ఉన్న నేపథ్యంలో 11 ఓట్లు వచ్చే అవకాశముంది. మొత్తం 16 ఓట్లలో ఐసిసి ఇండిపెండెంట్ మహిళా డైరెక్టర్లు ఇంద్రా నూరీతోపాటు పాకిస్తాన్ క్రికెట్బోర్డు, ఇతరులు ఖవాజాకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిసింది. దక్షిణాఫ్రికా క్రికెట్బోర్డు సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఓటింగ్లో పాల్గొనేది లేనిది ఆ దేశ క్రికెట్బోర్డు ప్రకటించలేదు. ఐసిసి పీఠంనుంచి వైదొలిగిన శశాంక్ మనోహర్ స్థానంలో తాత్కాలిక బాధ్యతల్లో ఖవాజా ఆ బాధ్యతలను నాలుగు నెలలుగా చూస్తున్నారు. మరోవైపు ఐసిసి ఏకగ్రీవంగా బార్కేను ఎన్నుకోవాలని చూసినా.. రేసులో ఖవాజా నిలవడంతో ఓటింగ్ అనివార్యమైన పరిస్థితి. దరఖాస్తు చేసుకొనేందుకు అక్టోబర్ 18(ఆదివారం) ఆఖరు తేదీ కాగా.. వీరిద్దరి నామినేషన్లు మాత్రమే వచ్చాయి.