Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైపై 7 వికెట్లతో గెలుపు
- ప్లే ఆఫ్ ఆశలు సజీవం
అబుదాబి: చెన్నై సూపర్కింగ్స్పై రాజస్తాన్ రాయల్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేయగా.. అనంతరం రాజస్తాన్ 17.3 ఓవర్లలో 3 నష్టానికి 126 పరుగులు చేసి గెలిచింది. రాజస్తాన్ బౌలర్లు శ్రేయస్ గోపాల్, తెవాటియాలకు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై స్వల్పస్కోర్కే పరిమితమైంది. దీంతో ఈ సీజన్ ఐపిఎల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా చెన్నై నిలవగా ఈ గెలుపులో రాజస్తాన్ జట్టు ప్లే-ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. తొలినుంచే చెన్నైను రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. రాజస్తాన్ బౌలర్ల ధాటికి పరుగులు సాధించేందుకు కష్టపడిన చెన్నై టపటపా వికెట్లు చేజార్చుకుంది. డుప్లె సిస్(10), వాట్సన్(8), రాయుడు(13) ఘోరం గా విఫలమయ్యారు. ఓపెనర్ శామ్ కరన్(22: 25 బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(28; 28 బంతుల్లో 2ఫోర్లు) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. చివర్లో ఆల్రౌండర్ జడేజా(35; 30 బంతుల్లో 4 ఫోర్లు) టాప్స్కోరర్గా నిలవడంతో చెన్నై జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగల్గింది. రాజస్తాన్ బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో చెన్నై ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. డెత్ ఓవర్లలో జడేజా ఒక్కడే ఒంటరి పోరాడటం చేయడంతో 120 స్కోరు దాటింది. త్యాగీ వేసిన 18వ ఓవర్లో ధోనీ రనౌట్ కావడంతో చెన్నై 10-15 పరుగులు తక్కువ చేసింది. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(1/20), కార్తీక్ త్యాగీ(1/35), శ్రేయాస్ గోపాల్(1/14), రాహుల్ తెవాటియా(1/18) తలో వికెట్ పడగొట్టారు.
ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో స్మిత్(26నాటౌట్)కి తోడు, బట్లర్(70నాటౌట్) చెలరేగడంతో ఆ జట్టు మరో వికెట్ పడకుండా విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బట్లర్ కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాది చివరివరకూ క్రీజ్లో నిలిచాడు. వీరిద్దరూ రాణించడంతో రాజస్తాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. చాహర్కు రెండు, హేజిల్వుడ్కు ఒక వికెట్ దక్కాయి.
ధోనీ ఏ 200
చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాజస్తాన్తో మ్యాచ్ ఆడుతూ రెండు రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. ఐపిఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగానిగా, కెప్టెన్గా 4వేల పరుగులు చేసిన ఆటగానిగా ఈ రికార్డులను తనపేర లిఖించుకున్నాడు. ధోనీకి రాజస్తాన్తో మ్యాచ్ 200వది కాగా.. చెన్నై తరఫున ఆడుతూ 4000 పరుగులను పూర్తి చేశాడు. అందులో 23 అర్ధశతకాలు ఉన్నాయి. లీగ్లో అత్యధిక స్కోరు 84. సుదీర్ఘకాలంగా జట్టుకు తరఫున ఆడుతున్న మహీని చెన్నై అభిమానులు ముద్దుగా 'తలైవా' అంటూ పిలుస్తుంటారు.
స్కోర్బోర్డు..
చెన్నై ఇన్నింగ్స్: కర్రన్ (సి)బట్లర్ (బి)గోపాల్ 22, డుప్లెసిస్ (సి)బట్లర్ (బి) ఆర్చర్ 10, వాట్సన్ (సి)తెవాటియా (బి)త్యాగీ 8, రాయుడు (సి)శాంసన్ (బి)తెవాటియా 13, ధోనీ (రనౌట్) ఆర్చర్/శాంసన్ 28, జడేజా (నాటౌట్) 35, కేదర్ జాదవ్ (నాటౌట్) 4, అదనం 5. (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 125 పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/26, 3/53, 4/56, 5/107.
బౌలింగ్: ఆర్చర్ 4-0-20-1, రాజ్పుత్ 1-0-8-0, త్యాగీ 4-0-35-1, స్టోక్స్ 3-0-27-0, గోపాల్ 4-0-14-1, తెవాటియా 4-0-18-1.
రాజస్తాన్ ఇన్నింగ్స్: స్టోక్స్ (బి)దీపక్ చాహర్ 19, ఉతప్ప (సి)ధోనీ (బి)హేజిల్వుడ్ 4, శాంసన్ (సి)ధోనీ (బి)దీపక్ చాహర్ 0, స్మిత్ (నాటౌట్) 26, బట్లర్ (నాటౌట్) 70, అదనం 7. (17.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 126 పరుగులు.
వికెట్ల పతనం: 1/26, 2/28, 3/28
బౌలింగ్: దీపక్ చాహర్ 4-1-18-2, హేజిల్వుడ్ 4-0-19-1, జడేజా 1.3-0- 11-0, శార్దూల్ ఠాకుర్ 4-0-34-0, కర్రన్ 1-0-6-0, చావ్లా 3-0-32-0.