Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్, భారత్ సిరీస్ పై గంగూలీ
- సీపీఐ(ఎం) ఎమ్మెల్కే పుస్తకం ఆవిష్కరణ
కోల్కత : నూతనంగా నిర్మించిన అతిపెద్ద స్టేడియం భారత్, ఇంగ్లాండ్ డే నైట్ గులాబీ టెస్టు మ్యాచ్తో ప్రారంభం కానుంది!. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేర్కొన్నాడు. కోల్కతలోని ప్రెస్ క్లబ్లో సీపీఐ(ఎం) ఎమ్మెల్కే అశోక్ భట్టాచార్య రాసిన పుస్తకావిష్కరణ సభలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ' అహ్మదాబాద్లో భారత్, ఇంగ్లాండ్ గులాబీ బంతి టెస్టు జరుగుతుంది. అహ్మదాబాద్, ధర్మశాల, కోల్కతలు టెస్టు వేదికల జాబితాలో ఉన్నాయి. కానీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంగ్లాండ్ సిరీస్ ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. రానున్న రోజుల్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. టీమ్ ఇండియాలో వరల్డ్ క్లాస్ క్రికెటర్లు ఉన్నారు. ఐపీఎల్ నుంచి నేరుగా టెస్టులు ఆడగల నైపుణ్యం, సత్తా వారికి ఉన్నాయి. త్వరలోనే జరుగనున్న వార్షిక సర్వ సభ్య సమావేశంలో రంజీ ట్రోఫీపై ఓ నిర్ణయం తీసుకోనున్నాం' అని గంగూలీ తెలిపాడు. ఇక 71 ఏండ్ల కమ్యూనిస్టు యోధుడు అశోక్ భట్టాచార్య ఇటీవల కోవిడ్19 మహమ్మారిని జయించారు. తాజాగా ఆయన రాసిన పుస్తకంలో తాను కరోనా వైరస్ను జయించిన తీరును రాసుకొచ్చారు. సిలిగురి మున్సిపల్ కార్పోరేషన్ బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్కు భట్టాచార్య చైర్మన్గా కొనసాగుతున్నారు.