Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత జట్టుకు దొరకని స్పాన్సర్లు
- జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసీస్ టూర్కు..!
ముంబయి : భారత క్రికెట్తో 15 ఏండ్ల బంధానికి గుడ్ బై చెబుతూ ప్రముఖ స్పోర్ట్స్ ఉత్పాదకాల కంపెనీ నైకీ ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్కు నైకీ రూ.88 లక్షలు చెల్లించేంది. ఏడాదికి అదనంగా రాయల్టీ సైతం చెల్లించేంది. కరోనా ప్రతికూల పరిస్థితులు, భారత్లో ఉన్న స్టోర్లను నైకీ మూసివేయటంతో బీసీసీఐ జెర్సీ స్పాన్సర్షిప్ ఒప్పందం ఆ సంస్థకు భారమైంది. దీంతో ఒప్పందం పునరుద్ధరణకు సుముఖంగా లేమని జూన్లోనే బీసీసీఐకి తెలియజేసింది. నైకీ నిర్ణయంతో బీసీసీఐ ఈ ఏడాది ఆగస్టులో నూతన టెండర్లు పిలిచింది. కరోనా కారణంగా మ్యాచ్ ఫీజును 31 శాతం కుదిస్తూ రూ.61 లక్షలకు తీసుకొచ్చింది. నైకీ ఓ మ్యాచ్కు రూ.88 లక్షలు చెల్లించేది. సెప్టెంబర్ 21న ఆసక్తి వ్యక్తీకరణకు చివరి తేది. అయినా ఏ కంపెనీ బీసీసీఐ జెర్సీ స్పాన్సర్షిప్ కోసం ముందుకు రాలేదు. ఆడిడాస్, పుమాల నుంచి బిడ్లు దాఖలు అవుతాయని బోర్డు ఆశించినా.. అటువంటి ప్రయత్నం ఆ కంపెనీలు చేయలేదు. మ్యాచ్కు. 61 లక్షలకు తోడు ఏడాదికి రూ. 6 కోట్ల కనీస మొత్తం డీల్ నిబంధనను బోర్డు టెండరులో పెట్టింది. దీంతో టెండర్ల ప్రక్రియను పక్కనపెట్టి.. నేరుగా ముఖాముఖి చర్చలు జరిపి హక్కులు అందించేందుకు బోర్డు సిద్ధమైందని తెలుస్తోంది. భారత క్రికెటర్లు, బోర్డు పెద్దలు ప్రస్తుతం ఐపీఎల్ 2020తో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ నవంబర్ 10తో ముగియనుంది. ఆ వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. దీంతో జెర్సీ భాగస్వామి లేకుండానే ప్రపంచ ధనిక బోర్డు తన జట్టును బరిలోకి దింపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాతీయ జట్టు జెర్సీ భాగస్వామి స్పాన్సర్షిప్ డీల్ను బీసీసీఐ సీరియస్గా తీసుకుంటే గానీ ఆసీస్ పర్యటన లోపు కోహ్లిసేన ధరించే జెర్సీకి కొత్త స్పాన్సర్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.