Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్, హైదరాబాద్ ఢ నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
దుబాయ్ (యుఏఈ) : పది మ్యాచుల్లో ఆరు పరాజయాలు, నాలుగు విజయాలు. ప్లే ఆఫ్స్ రేసు నుంచి దూరం చేసేందుకు ఓ పరాజయం చాలు!. ఇటువంటి పరిస్థితుల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్రైజర్స్ హైదరాబాద్లు నేడు చావోరేవో తేల్చుకునేందుకు రెఢ అయ్యాయి. సీజన్లో గొప్పగా ఆడుతున్నా, లేటుగా విజయాలను చూస్తున్న పంజాబ్ నేడు ఫామ్లో ఉన్న హైదరాబాద్ను ఎదుర్కొనుంది. డెవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో భాగస్వామ్యం లేని సన్రైజర్స్ ఛేదన ఇంతవరకు ఐపీఎల్ చూడలేదు. కానీ మనీశ్ పాండే, విజయ్ శంకర్ ఆ సంప్రదాయానికి మంగళం పాడేశారు. ఆ ఇద్దరూ తొలి మూడు ఓవర్లలోనే నిష్క్రమించినా మరో వికెట్కు తావులేకుండా కూల్గా ఛేదనను పూర్తి చేశారు. దేశవాళీ మెరుపులు తోడైన సన్రైజర్స్ నేటి మ్యాచ్లో సరికొత్తగా బరిలోకి దిగుతుండగా.. ప్లే ఆఫ్స్ రేసులో వెనక్కి చూసే ప్రసక్తే లేదనే యోచనలో పంజాబ్ కనిపిస్తోంది. హైదరాబాద్, పంజాబ్ తలపడిన గత మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ అదిరే విజయం సాధించింది. జానీ బెయిర్స్టో చెలరేగిన ఆ మ్యాచ్లో పంజాబ్ అసలు పోటీ ఇవ్వలేదు. వరుస విజయాల ఊపుమీదున్న పంజాబ్ నేడు హైదరాబాద్పై ప్రతీకారంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిస్తుందేమో చూడాలి. బెంగళూర్ చేతిలో చిత్తుగా ఓడిన కోల్కత నైట్రైడర్స్పై విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకునే దారిలో ఢిల్లీ క్యాపిటల్స్ కనిపిస్తోంది. బెంగళూర్ చేతిలో కోల్కత 84 పరుగులే చేసిన సంగతి తెలిసిందే. నేటి మ్యాచ్లో అండ్రీ రసెల్, సునీల్ నరైన్ రానుండటంతో కోల్కత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు రెండు పాయింట్ల దూరంలో నిలిచిన ఢిల్లీ.. నేడు ఆ మార్క్ చేరుకోవాలని చూస్తోంది. అబుదాబిలో కోల్కత, ఢిల్లీ మ్యాచ్ మధ్యాహ్నాం 3.30 గంటలకు ఆరంభం కానుంది.