Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి, బెంగళూర్ ఢీ నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
అబుదాబి : ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్స్ రేసులో ఏడు జట్లు పోటీపడుతున్న వేళ.. నేడు ఓ బెర్త్ ఖాయం కానుంది!. 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతున్న ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్లు నేడు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ముఖాముఖి పోటీపడనున్నాయి. ఓ మ్యాచ్లో ఓడితే ఆశలు ఆవిరి అనే పరిస్థితిలో ఉన్న జట్టు, ఓ విజయంతో ప్లే ఆఫ్స్ ఖాయం చేసుకునే జట్లు తలపడుతున్న మ్యాచుల్లో అద్భుత ప్రదర్శనలతో అన్ని జట్లు రేసులోనే నిలుస్తున్నాయి. ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్లలో ఏ జట్టు విజయం సాధించినా... 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ను సొంతం చేసుకోనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో దూరం కావటంతో ముంబయి ఇండియన్స్ మానసికంగా వెనుకంజ వేసినా.. మైదానంలో కీరన్ పొలార్డ్ నాయకత్వంలో ఆ జట్టు దూకుడు కొనసాగుతూనే ఉంది. మరోవైపు కీలక మ్యాచ్లో ఫామ్లో ఉన్న ఏబీ డివిలియర్స్ బెంగళూర్కు కీలకం కానున్నాడు. ఇన్నాండ్లూ బలహీనంగా మారిన బౌలర్లు ఇప్పుడు బెంగళూర్కు అస్త్రంగా తయారు కావటంతో విరాట్ కోహ్లిసేన ఉరకలేస్తోంది. ముంబయి ఇండియన్స్ అన్ని విభాగాల్లోనూ జోరుమీదుంది. దీంతో ప్లే ఆఫ్స్ ముఖాముఖి రేసులో పైచేయి ఎవరిదో చూడాలి. ముంబయి, బెంగళూర్ మ్యాచ్ అబుదాబిలో జరుగనుంది.