Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సార్లోర్లక్స్ ఓపెన్ టోర్నీనుంచి వైదొలిగిన భారత్
సార్బ్రుకెన్(జర్మనీ): సార్లోర్లక్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీనుంచి భారత్ వైదొలిగింది. భారత షట్లర్ బృందం కోచ్, డిఫెండింగ్ ఛాంపియన్ లక్ష్యసేన్ తండ్రికి కరోనా సోకింది. దీంతో ముగ్గురు సభ్యుల భారత బ్యాడ్మింటన్ బృందాన్ని నిర్వాహకులు ఐసోలేషన్లో ఉంచారు. 'భారత షట్లర్లు శుభాకర్ దే, లక్ష్యసేన్, జయరామ్ టోర్నీనుంచి వైదొలిగారనీ, కోచ్కు కరోనా సోకడంతో వీరందరినీ ఐసోలేషన్లో ఉంచామనీ, మరోసారి కరోనా పరీక్షలు జరిపి అందరికీ నెగెటివ్ వస్తే వాళ్లందరినీ తిరిగి భారత్కు పంపడం జరుగుతుంది' అని బీడబ్ల్యూఎఫ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో అజరు జయరామ్, శుభాంకర్ దే గెలిచిన సంగతి తెలిసిందే.