Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబుదాబి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్)లో సత్తా చాటుతున్న ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్కు చోటు ఇవ్వకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై.. టీమిండియా కోచ్ రవిశాస్త్రి మాత్రం ''సూర్య నమస్కార్. ధైర్యంగా, కాస్త ఓపికగా ఉండు'' అంటూ అతడికి సూచించడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్కు ఆసీస్ టూర్కు ఎంపిక చేయకపోవడంపై హర్భజన్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇక గురువారం బెంగళూరు-ముంబయి మ్యాచ్ సందర్భంగా కోహ్లి, సూర్యకుమార్ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సూర్యకుమార్ దూకుడుగా సమయంలో కోహ్లీ కండ్లతోనే అతనిని తీక్షణంగా చూస్తున్న దశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.