Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ తో సిరీస్పై డెవిడ్ వార్నర్
సిడ్నీ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియాతో సిరీస్ అనగానే ముందుగా మాటల యుద్ధమే గుర్తుకొస్తుంది. గత పర్యటనలో మైదానంలో ఎన్నో ఉద్రిక్త సంఘటనలను చూశాం. అయితే ఈ సిరీస్లో అటువంటి కవ్వింపులు ఉండవని ఆసీస్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ అంటున్నాడు. ' మాటల యుద్ధం అంటే వ్యక్తిగతంగా నాకు, సమరంలోకి పూర్తిగా దూకటమే. గత వేసవిలో ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వచ్చాం. మ్యాచులపై పూర్తి ఏకాగ్రత సాధించాలని అనుకున్నాను. అందుకు నేను భిన్నమైన మార్గం ఎంచుకున్నాను, అది మంచిగా పని చేసింది. ఈ ఏడాది పూర్తి భిన్నం. వైట్ బాల్ సిరీస్లో పర్యటన ఆరంభం కానుంది. సహజంగా రెడ్ బాల్తో మొదలుపెడతాం. ఇది కొంత ఆసక్తిగానూ ఉంది. విరాట్ కోహ్లి ఏడు మ్యాచుల్లోనే ఆడుతున్నాడు. మైదానంలోకి జట్టుగా బరిలోకి దిగి, భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుని.. భారత్ ను నైపుణ్యంతోనే కొడతాం' అని డెవిడ్ వార్నర్ అన్నాడు.