Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్లడించిన బీసీసీఐ బాస్ గంగూలీ
కోల్కత : 2021 టీ20 ప్రపంచకప్కు బీసీసీఐ పక్కాగా ప్రణాళిక చేస్తున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్.. అందుకోసం ఎక్కువగా పోటీ మ్యాచులు షెడ్యూల్ చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఆ సిరీస్లో భారత్, ఇంగ్లాండ్లు ఐదు టీ20ల్లో తలపడతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. ' ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లతో పూర్తి స్థాయి సిరీస్ ఆడనున్నారు. కరోనా వైరస్ మళ్లీ పంజా విప్పుతుందనే వార్తల నేపథ్యంలో రెండు జట్లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ను నిర్వహించటం చాలా తేలిక. అయినా, మేము జాగ్రత్తగానే ఉంటాం. వచ్చే ఏడాది ఐపీఎల్ను భారత్లోనే నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఐపీఎల్ భారత టోర్నీ. అహ్మదాబాద్లో ఇంగ్లాండ్తో డే నైట్ పింక్ బాల్ టెస్టుపై నిర్ణయం తీసుకోలేదు. భారత క్రికెట్ జట్టు నవంబర్ 13న ఆస్ట్రేలియాకు చేరుకుంది. నేటితో క్వారంటైన్ గడువు ముగియనుంది. ఆసీస్లో ఉన్న జట్లు రెగ్యులర్ సాధనలో నిమగం అవుతాయి. ఆసీస్లో కోవిడ్19 కేసులు పెద్దగా లేవు, కాబట్టి పెద్దగా ఆందోళన లేకుండా బరిలోకి దిగేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు' అని గంగూలీ తెలిపాడు. ఇదిలా ఉండగా, గత నాలుగున్నర నెలల్లో ఏకంగా 22 సార్లు కోవిడ్19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకున్నానని గంగూలీ వెల్లడించాడు. ' ఈ విషయం మీకు చెప్పాలి. గత నాలుగున్నర మాసాల్లో 22 సార్లు కరోనా పరీక్షలకు హాజరయ్యాను. నా చుట్టు ఉన్న వ్యక్తులకు పాజిటివ్ రావటంతో, నేను పరీక్ష చేసుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ కోసం దుబారు వెళ్లాను. నేను నా పేరంట్స్తో ఉంటున్నాను. నా కారణంగా అందరికీ కోవిడ్ వ్యాప్తి చెందుతుందనే భయం నాలో ఉన్నది. అందుకు ఎక్కువ పరీక్షలు చేసుకున్నాను' అని దాదా అన్నాడు.