Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత
- స్లో ఓవర్రేట్పై మ్యాచ్ రీఫరీ
సిడ్నీ : తొలి వన్డేలో టీమ్ ఇండియాకు డబుల్ షాక్ తగిలింది. సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలోకి దిగిన టీమ్ ఇండియా సిడ్నీ వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో 66 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. సిడ్నీలో కోహ్లిసేన మ్యాచ్తో పాటు మ్యాచ్ ఫీజునూ పోగొట్టుకుంది. ఆస్ట్రేలియాపై 50 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు భారత్ 246 నిమిషాల సమయం తీసుకుంది. మ్యాచ్ మధ్యలో వచ్చిన అవాంతరాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ నిర్ణీత సమయానికి కోహ్లిసేన ఓ ఓవర్ వెనుకంజలోనే నిలిచింది. ఐసీసీ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేటు అపరాధానికి ప్రతి ఓవర్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. దీంతో టీమ్ ఇండియాలోని 11 మంది క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ డెవిడ్ బూన్ నిర్ణయం తీసుకున్నాడు. స్లో ఓవర్రేట్ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అంగీకరించటంతో, ఈ విషయంలో రిఫరీ నిర్ణయమే అంతిమం. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో సిడ్నీ వన్డేకు తొలిసారి అభిమానులను అనుమతించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో భారత కంపెనీ అదాని గ్రూప్ చేపడుతున్న బొగ్గు గనుల ప్రాజెక్ట్కు నిరసనగా ఇద్దరు అభిమానులు ప్లకార్డులతో పిచ్కు చేరువగా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఓవర్ల మధ్య విరాట్ కోహ్లి కాస్త ఎక్కువ విరామం తీసుకున్నాడు. తాను ఆడిన మ్యాచుల్లో సుదీర్ఘమైన 50 ఓవర్ల మ్యాచ్ ఇదేనని మ్యాచ్ అనంతరం ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించాడు.