Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేపై స్టీవ్ స్మిత్
సిడ్నీ : భారత్తో వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా పరుగుల సునామీకి నాయకత్వం వహిస్తున్నాడు స్టీవ్ స్మిత్. సంప్రదాయ క్రికెటర్గా స్టీవ్ స్మిత్కు విధ్వంసక ఇన్నింగ్స్లు ఆడిన చరిత్ర లేదు. పైగా, వన్డేల్లో స్మిత్ నిలకడగా మెరిసిన సందర్బాలూ తక్కువే. అతడి నుంచి డెవిడ్ వార్నర్, మాక్స్వెల్ తరహాలో ఆకాశమే హద్దుగా చెలరేగే ఇన్నింగ్స్లు ఆశించలేము. కానీ భారత్తో వన్డే సిరీస్లో స్టీవ్ స్మిత్ తనలోకి భిన్నమైన కోణాన్ని బయటపెట్టాడు. ఐపీఎల్లో ధనాధన్ రేసులో వెనుకబడిన స్మిత్.. సొంతగడ్డపై గర్జించాడు. తొలి వన్డేలో 62 బంతుల్లో సెంచరీ బాదిన స్మిత్, రెండో వన్డేలో 61 బంతుల్లోనే ఆ ఘనత సాధించాడు. స్మిత్ మెరుపు సెంచరీలతో ఆస్ట్రేలియా రెండు వన్డేల్లోనూ భారీ విజయాలు సొంతం చేసుకుంది. అయితే సిడ్నీ రెండో వన్డేకు ముందు స్మిత్ విపరీతమైన తలనొప్పితో బాధపడినట్టు అతడు వెల్లడించాడు. తల తిరుగుడు సమస్యతో అసలు మ్యాచ్లో ఆడతాననే నమ్మకం లేదని అన్నాడు. ' రెండో మ్యాచ్లో ఆడతానని అనుకోలేదు. మ్యాచ్కు ముందు రోజు ఉదయం విపరీతమైన తలనొప్పితో బాధపడ్డాను. క్రీజులోకి వచ్చిన కొన్ని షాట్లు ఆడి, పరుగులు తీసిన తర్వాత కుదుటపడిన భావన కలిగింది. ఉదయం తీక్షణంగా పరీక్షించిన డాక్టర్ చెవిని శుభ్రం చేశాడు' అని స్మిత్ వెల్లడించారు. చెవిలో అంతర్గత సమస్య కారణంగా విపరీతమైన తలనొప్పితో వస్తుంది. ఇంగ్లాండ్ సిరీస్లో తలకు దెబ్బ తగటం సైతం స్మిత్పై ప్రభావం చూపించి ఉంటుంది!.