Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత డ్రెస్సింగ్ రూమ్ పై మదన్ లాల్
ముంబయి : భారత క్రికెట్ జట్టులో క్రికెటర్ల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోవటం కనిపిస్తోందని క్రికెట్ సలహా సంఘం (సీఓసీ) సభ్యుడు మదన్లాల్ అభిప్రాయపడ్డాడు. స్టార్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మ గాయం విషయంలో జట్టు మేనేజ్మెంట్కు సమాచారం లేకపోవటంపై మదన్లాల్ విమర్శించాడు. 70 శాతం ఫిట్నెస్తో ఐపీఎల్లో మూడు మ్యాచులు రోహిత్ శర్మ ఎందుకు ఆడాడు, ఆస్ట్రేలియాకు వెళ్లకుండా బెంగళూర్లోని ఎన్సీఏకు ఎందుకు వెళ్లాడనే అంశాలపై స్పష్టత ఉండాల్సిందని మదన్లాల్ అన్నాడు. ' మీడియా సమావేశంలో విరాట్ కోహ్లి చెప్పినది వంద శాతం సబబు. విరాట్ కోహ్లి వ్యాఖ్యలకు నా మద్దతు ఉంటుంది. జట్టును నడిపించే నాయకుడికి తన ఆటగాళ్లపై ఓ స్పష్టత ఉండాలి. కెప్టెన్, కోచ్లకు తమ ఆటగాళ్ల విషయంలో ఏం జరుగుతుందనే సమాచారం ఉండాలి. పూర్తి ఫిట్నెస్ లేకపోయినా ఐపీఎల్లో ఎందుకు ఆడాల్సి వచ్చిందనే విషయంపై రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ ప్రాంఛైజీ సమాధానం ఇవ్వాలి. కమ్యూనికేషన్ ఉండాల్సిన స్థాయిలో సరిగా లేదు. ఏం జరుగుతుందనే స్పష్టత డ్రెస్సింగ్రూమ్లో ఉండటం అవసరం' మదన్లాల్ వ్యాఖ్యానించాడు.