Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడేజాకు మల్టిపుల్ గాయాలు
కాన్బెర్రా : తొలి టీ20లో భారత్కు ఓకే స్థానంలో ఆడిన ఇద్దరు ఆటగాళ్లు అద్భుత విజయాన్ని కట్టబెట్టారు!. అదేలా అంటారా? నిజమే బ్యాట్తో రవీంద్ర జడేజా చెలరేగగా.. బంతితో అతడి స్థానంలో ఆడిన యుజ్వెంద్ర చాహల్ మాయాజాలం సృష్టించాడు. చాహల్ నాలుగు ఓవర్లలో 25 పరుగులకు మూడు ప్రధాన వికెట్లు పడగొట్టాడు. అంతకముందు రవీంద్ర జడేజా (44 నాటౌట్, 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు. జడేజా విన్యాసాలతో భారత్ తొలుత 161 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. జడేజాకు కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన చాహల్ (3/25)తో తొలి టీ20 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
జడేజాకు ఏమైంది? : డెత్ ఓవర్లలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజాకు మల్టిపుల్ గాయాలు అయ్యాయి. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరు ఓవర్లో రెండో బంతి జడేజాకు హెల్మెట్కు తగిలింది. జడేజా భారీ షాట్కు ప్రయత్నించగా.. బంతి బలంగా జడ్డూ హెల్మెట్కు తగిలింది. అంతకముందు, తొడ కండరాలు పట్టేయటంతో జడేజా ఇబ్బంది పడ్డాడు. అయినా, ఆఖరు ఓవర్లో బ్యాటింగ్ కొనసాగించాడు. కంకషన్ కారణంగా జడేజా మ్యాచ్కు దూరమవగా, నిబంధనల ప్రకారం రిఫరీ అనుమతితో మరో ఆటగాడిని భారత్ తుది జట్టులోకి తీసుకుంది.
ఆసీస్ అభ్యంతరం : రవీంద్ర జడేజా కంకషన్ కావటంతో మణికట్టు స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ను కంకషన్ సబ్స్టిట్యూట్గా అనుమతించటంపై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు మ్యాచ్ రిఫరీ డెవిడ్ బూన్తో అతడు వాదనకు దిగాడు. నిబంధనల ప్రకారం కంకషన్ సబ్స్టిట్యూట్పై మ్యాచ్ రిఫరీ తుది నిర్ణయం తీసుకుంటాడు. మిగిలి ఉన్న మ్యాచ్లో కంకషన్కు గురైన ఆటగాడు పోషించాల్సిన పాత్ర.. సబ్స్టిట్యూట్గా రావాల్సిన ఆటగాడు పోషించేబోయే పాత్ర ఒకే విధంగా ఉండాలి. కంకషన్ సబ్స్టిట్యూట్తో ఓ జట్టుకు అదనపు ప్రయోజనం చేకూరకూడదు. ఆల్రౌండర్ జడేజా.. స్పిన్ బౌలర్గా నాలుగు ఓవర్లు వేయాల్సి ఉంది. దీంతో మరో స్పిన్ బౌలర్ చాహల్ను మ్యాచ్ రిఫరీ అనుమతించాడు. అయితే, జడేజాకు అసలు కంకషనే కాలేదని.. అతడు తొడ కండరాల గాయంతోనే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడని ఆస్ట్రేలియా వాదనగా అనిపిస్తోంది. ఆసీస్ వాదన ఎలాగున్నా.. భారత్కు తొలి టీ20లో ఒకే స్థానంలో ఆడిన ఇద్దరు ఆటగాళ్లు మెరుపు విజయాన్ని అందించారు. టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలబెట్టారు. అయితే, జడేజా మల్టిపుల్ గాయాల నుంచి కోలుకుని ఆదివారం జరిగే రెండో వన్డేకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగానే ఉంది.