Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి చికిత్స కొనసాగుతున్నది. తదుపరి చికిత్స అంశంపై సోమవారం మెడికల్ బోర్డు సమావేశమవుతుందని వుడ్ల్యాండ్స్ హాస్పిటల్ పేర్కొంది. ఈ మేరకు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గంగూలీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది. స్వల్ప గుండెపోటుతో గంగూలీ శనివారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గంగూలీకి యాంజియోప్లాస్టీ జరిగిందనీ, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నది.పూర్తిగా స్పృహలో ఉన్నాడని పేర్కొంది. గుండె రక్తనాళాల్లో రెండు చోట్ల పూడికలు ఉన్నాయనీ, వాటికి చికిత్స అందిస్తామని చెప్పింది.