Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు చేదు వార్త ఇది. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్కు దూరమవుతున్నట్టు దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ప్రకటించాడు. అయితే పోటీ క్రికెట్ నుంచి తాను తప్పుకోవట్లేదనీ, కాస్త విరామం మాత్రమే తీసుకుంటున్నట్టు తెలిపాడు. బంతుల్ని బుల్లెట్లా విసిరే స్టెయిన్ వచ్చే సీజన్కు దూరమవ్వడం ఆర్సీబీకి ప్రతికూలాంశమే. అయితే గత సీజన్లో స్టెయిన్ నిరాశపరిచాడు. మూడు మ్యాచ్లు ఆడిన అతడు భారీగా పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ''ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీకి అందుబాటులో ఉండట్లేదు. అలా అని ఇతర జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కాదు. కాస్త విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నా'' అని స్టెయిన్ ట్వీట్ చేశాడు. అయితే ఐపీఎల్కు దూరమవుతున్నా ఇతర లీగ్ల్లో ఆడతానని స్టెయిన్ మరో ట్వీట్లో తెలిపాడు. ఎంతో ప్రేమించే క్రికెట్ను కొనసాగించాలనుకుంటున్నాననీ, ఆటకు వీడ్కోలు పలకట్లేదని స్పష్టం చేశాడు. కాగా, స్టెయిన్ ట్వీట్పై ఆర్సీబీ స్పందించింది. 'మమ్మల్ని మిస్ అవుతారు. ఎన్నో జ్ఞాపకాలు అందించినందుకు కృతజ్ఞతలు. మాకు మద్దతుగా ఉండండి' అని ట్వీట్ చేసింది. కాగా ఐపీఎల్లో 95 మ్యాచ్లు ఆడిన స్టెయిన్ 97 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఇప్పటివరకు కోహ్లీసేన టైటిల్ను ఒక్కసారి కూడా అందుకోని విషయం తెలిసిందే.