Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ సారథి విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారా..? లేదా అన్నదానిపై చర్చ నడుస్తున్నది. ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం (ఏసీఏ) నిబంధనల ప్రకారం సిరీస్ ముగిసే వరకు ఆటగాళ్లు బయటకు పోకూడదు. అయితే గత డిసెంబర్ 7న కోహ్లీ, హార్దిక్ సిడ్నీలోని బేబీ షాప్లో ముఖానికి మాస్కులు ధరించకుండా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలను ఆ హౌటల్ యాజమాన్యమే పోస్టు చేయడం గమనార్హం.
''ఇవాళ మా స్టోర్కు ప్రత్యేకమైన అతిథులు వచ్చారు'' అంటూ ఇన్స్టాగ్రామ్లో బేబీషాప్ పోస్టు చేసింది. తాజాగా ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ సహా ఐదుగురు ఆటగాళ్లు కూడా కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ శనివారం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అయిన ఫోటో హల్చల్ చేస్తున్నది.
బుల్లెట్ లాంటి బౌలర్ అవుట్...