Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తులు ఆహ్వానించిన సాయ్
న్యూఢిల్లీ : మాజీ క్రీడాకారులు సహా అత్యున్నత స్థాయిలో పోటీపడిన క్రీడాకారుల సేవలను సద్వినియోగం చేసుకునేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఓ బృహత్తర ఆలోచనతో ముందుకొచ్చింది. సాయ్ లో కోచ్లుగా చేరేందుకు ఒలింపియన్లు, పారా ఒలింపియన్లకు సాయ్ పిలుపు ఇచ్చింది. డిసెంబర్లో 11 మంది ఒలింపియన్లు, ముగ్గురు పారా ఒలింపియన్లను సాయ్ లో కోచ్లుగా సాయ్ నియమించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులను నేరుగా గ్రేడ్-ఏ కోచ్లుగా నియమితులు కానున్నారు. ఒలింపియన్లు, పారా ఒలింపియన్లు లెవల్-6, లెవల్-10 కోచ్లుగా నియమితులు కానున్నారు. పారా ఒలింపిక్స్ మెడలిస్ట్ మారియప్పన్కు సాయ్ గ్రేడ్-ఏ కోచ్ పదవి ఆఫర్ చేసింది. ప్రొఫెషనల్ కెరీర్లో కొనసాగుతున్న ఒలింపియన్లు సైతం సాయ్ కోచ్లు చేరి.. మళ్లీ అంతర్జాతీయ వేదికపై పోటీపడవచ్చు. ఇది వర్థమాన క్రీడాకారులకు ఉపయోగకరం మాత్రమే కాదు కోచ్లకు సైతం ఆర్థికంగా ఉపయుక్తంగా ఉండనుంది. దీనికి ఒలింపియన్లు, పారా ఒలింపియన్ల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.