Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్
హైదరాబాద్ : ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాలనే పట్టుదలతో అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశెనపల్లి జగన్మోహన్ రావు కోరారు. జాతీయ హ్యాండ్బాల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జగన్ తొలిసారి పంజాబ్ పర్యటనకు వెళ్లారు. హెచ్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు ఆనందీశ్వర్ పాండేతో కలిసి అక్కడ హ్యాండ్బాల్ మౌళిక సదుపాయాలను జగన్ పరిశీలించారు. హ్యాండ్బాల్ అభివృద్దికి, స్టేడియాలను ఆధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని పంజాబ్ రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘాన్ని జగన్ కోరారు. వ్యవస్థాగత సౌకర్యాలు అభివృద్ది, వర్థమాన క్రీడాకారుల అన్వేషణలో సమష్టిగా కృషి చేయాలని అన్నారు. స్థానిక హ్యాండ్బాల్ లీగ్లు నిర్వహించినప్పుడు కోవిడ్19 నిబంధనలను పాటించాలని జగన్ సూచించారు. ఈ సందర్భంగా పంజాబ్ రాష్ట్ర సంఘం జగన్ను సన్మానించింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి ప్రీత్పాల్ సింగ్, కోశాధికారి వినరు కుమార్, పంజాబ్ రాష్ట్ర సంఘం ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.