Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ (ఆస్ట్రేలియా):కెప్టెన్గా అజింక్య రహానె తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. 2017లో ధర్మశాల టెస్టు నుంచి రహానె తుది జట్టు ఎంపిక విషయంలో తన మార్క్ చూపిస్తున్నాడు. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులోనూ రహానె తుది జట్టును తనదైన శైలిలో ఎంచుకున్నాడు. సిడ్నీ టెస్టుకు తుది జట్టులో రహానె రెండు మార్పులు చేశాడు. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం టాప్ ఆర్డర్లో ఓ బ్యాట్స్మన్పై వేటు వేయటం. గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో మూడో పేసర్ను ఎన్నుకోవటం రహానె ముందున్న సవాళ్లు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్పై వేటు వేసిన రహానె.. రోహిత్ శర్మకు మార్గం సుగమం చేశాడు. ఇక మూడో పేసర్ రేసులో నవదీప్ సైనిని ఎంచుకున్నాడు. నెట్ బౌలర్ నుంచి టెస్టు జట్టులోకి ఎంపికైన తంగరసు నటరాజన్కు ఆరంగేట్ర అవకాశం దక్కుతుందని అందరూ ఊహించారు. కానీ అజింక్య రహానె సైనిని తుది జట్టులోకి తీసుకున్నాడు. నటరాజన్ను కాదని నవదీప్ సైనిని తీసుకోవటంపై సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తమైంది. తుది జట్టు కూర్పులో రహానె ఎప్పుడూ సంతృప్తి పరిచిన దాఖలాలు లేవు. కానీ మ్యాచ్ ఫలితం తనవైపుకు మలుపుకుని, ఔరా అనిపించాడు. ధర్మశాల, మెల్బోర్న్ తరహాలో సిడ్నీలోనూ రహానె తుది ఫలితాన్ని శాసిస్తాడేమో చూడాలి.