Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బిఎఫ్ఐ) ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. కరోనాతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వాయిదాపడుతూ వస్తున్న ఈ ఎన్నికలు ఫిబ్రవరి 3న జరగనున్నట్లు ఐబా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. బాక్సింగ్ ఫెడరేషన్ ఎన్నికల జాప్యానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఢిల్లీ హైకోర్టులో ఓ ఫిల్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల జాప్యానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు బిఎఫ్ఐకు గత నెలలో నోటీసులు పంపి ఎన్నికలు సాధ్యమైనంత త్వరలో జరపాలని ఆదేశించడంతో ఐబా ఈ నిర్ణయం తీసుకుంది.