Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బౌలింగ్లో జడేజా,
- బ్యాటింగ్లో శుభ్మన్
- ఆస్ట్రేలియా 338, భారత్ 96/2
- స్మిత్ సెంచరీ
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండోరోజు ఆటలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. జడేజా బౌలింగ్లో చెలరేగడంతో ఆస్ట్రేలియాను తొలుత 338 పరుగులకే పరిమితం చేసిన భారత్.. అనంతరం శుభ్మన్ అర్ధశతకానికి తోడు తొలివికెట్కు రోహిత్-శుభ్మన్ కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ఆసీస్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ సెంచరీకి తోడు.. లబూషేన్ సెంచరీకి దగ్గర్లో ఔట్ కావడం రెండోరోజు ఆటలో విశేషాలు... ఓవర్నైట్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌటైంది. మరో 172 పరుగులు జతచేసి మిగతా ఎనిమిది వికెట్లు ఆసీస్ కోల్పోయింది. లబూషేన్ (91; 196 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ దగ్గర్లో ఔట్ కాగా.. స్టీవ్ స్మిత్(131) శతకంతో మెరిసాడు. కడవరకు క్రీజ్లో నిలిచిన స్మిత్ జట్టు 300 పరుగుల మార్క్కు చేరుకోవడానికి దోహపదడ్డాడు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు నాలుగు, సైనీ, బుమ్రాకు రెండేసి వికెట్లు దక్కాయి.
స్మిత్ శతకం..
తొలిసెషన్లో మార్నస్ లబుషేన్-స్టీవ్ స్మిత్ కలిసి భారత బ్యాట్స్మన్లను ధీటుగా ఎదుర్కొన్నారు. లబూషేన్ (91; 196 బంతుల్లో 11ఫోర్లు)కి తోడు స్టీవ్ స్మిత్ (131; 226బంతుల్లో 16ఫోర్లు) సెంచరీతో కదం తొక్కారు. వీరిద్దరూ మూడో వికెట్కు 100 పరుగులు జత చేయడం విశేషం. జట్టు స్కోర్ 206 పరుగుల వద్ద జడేజా బౌలింగ్లో లబుషేన్ ఔటయ్యాడు. ఆ తర్వాత బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఓవైపు స్మిత్ ఒంటరి పోరాటం చేస్తున్నా.. అతనికి సహరించే మరో బ్యాట్స్మన్ కరువయ్యాడు. స్మిత్ కెరీర్లో 27వ శతకం పూర్తి చేసుకొని ఆఖరికి జడేజా అద్భుత త్రోకు రనౌట్ కావడంతో కంగారూజట్టు తొలి ఇన్నింగ్స్కు తెరపడింది.
రోహిత్, గిల్ శుభారంభం..
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 96పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ (26; 77 బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్) సంయమనంతో బ్యాటింగ్ చేయగా.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (50; 101 బంతుల్లో 8ఫోర్లు) అర్ధశతకంతో కదం తొక్కాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 70 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హేజిల్వుడ్ వేసిన 27వ ఓవర్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. ఆపై గిల్ అర్ధశతకం పూర్తిచేసుకొని కమిన్స్ బౌలింగ్లో గ్రీన్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. భారత్ 85పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పుజారా, రహనే కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.
స్కోర్బోర్డు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: విల్స్ (ఎల్బి) సైనీ 62, వార్నర్ (సి)పుజారా (బి)సిరాజ్ 5, లబూషేన్ (సి)రహానే (బి)జడేజా 91, స్మిత్ (రనౌట్) జడేజా 131, వేడ్ (సి)బుమ్రా (బి)జడేజా 13, గ్రీన్ (ఎల్బి)బుమ్రా 0, పైన్ (బి)బుమ్రా 1, కమ్మిన్స్ (బి)జడేజా 0, స్టార్క్ (సి)శుభ్మన్ (బి)సైనీ 24, లియన్ (ఎల్బి)జడేజా 0, హేజిల్వుడ్ (నాటౌట్) 1, అదనం 10. (105.4 ఓవర్లలో ఆలౌట్) 338 పరుగులు.
వికెట్ల పతనం: 1/6, 2/106. 3/206, 4/232, 5/249, 6/255, 7/278, 8/310, 9/315, 10/338
బౌలింగ్: బుమ్రా 25.4-7-66-2, సిరాజ్ 25-4-67-1, అశ్విన్ 24-1-74-0, సైనీ 13-0-65-2, జడేజా 18-3-62-4.
ఇండియా తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) అండ్ (బి)హేజిల్వుడ్ 26, శుభ్మన్ (సి)గ్రీన్ (బి)కమ్మిన్స్ 50, పుజారా(బ్యాటింగ్) 9, రహానే(బ్యాటింగ్) 5, అదనం 6. (45 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 96 పరుగులు.
వికెట్ల పతనం: 1/70, 2/85
బౌలింగ్: స్టార్క్ 7-4-19-0, హేజిల్వుడ్ 10-5-23-1, కమ్మిన్స్ 12-6-19--1, లియన్ 16-7-35-0.