Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్బోర్డు(బిసిసిఐ) ఇంటర్నేషన్ మేనేజ్మెంట్ గ్రూప్(ఐజిఎం)తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. బిసిసిఐ అధికారి ఒకరు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఐజిఎంకు ఈ వారంలో టెర్మినేషన్ నోటీసు పంపినట్లు తెలిపారు. 2007లో ఇండియన్ ప్రిమియర్లీగ్(ఐపిఎల్) ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 13ఏళ్లపాటు ఐఎంజితో బిసిసిఐ కొనసాగిందని, 2021నుంచి సొంత నిపుణులతో ఐపిఎల్ సీజన్-14ను జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఐపిఎల్ ఈవెంట్ హక్కులు 2022వరకు అలాగే కొనసాగుతాయని, 2021 మార్చి-ఏప్రిల్ ఐపిఎల్ సీజన్-14 జరగనుందని, అది భారత్లోనా.. విదేశాల్లో అనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. అలాగే ఈ ఏడాది ఐపిఎల్కు ముందు మినీ వేలం ఫిబ్రవరిలో జరగనుందని ఆ అధికారి తెలిపారు.