Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గబ్బాత్, ఆసీస్ జట్ల పరిస్థితి
బ్రిస్బేన్ : నాల్గో టెస్టు కోసం బ్రిస్బేన్కు చేరుకున్న భారత జట్టు మ్యాచ్కు ముందు కఠిన పరిస్థితులను ఎదు ర్కొంటుంది. బ్రిస్బేన్లో యుకె స్ట్రెయిన్ కేసు వెలుగులోకి రావటం, అక్కడ లాక్డౌన్ విధించటం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ సిరీస్లో చివరిదైన నాల్గో టెస్టు కోసం అక్కడికి ప్రయాణించేందుకు భారత జట్టు అభ్యంతరం వ్యక్తం చేసినా.. క్రికెట్ ఆస్ట్రేలియా హామీ మేరకు బీసీసీఐ అందుకు సమ్మతించింది. భారత్, ఆస్ట్రేలియాలు మంగళవారం మధ్యాహ్నాం బ్రిస్బేన్కు చేరుకున్నాయి. అక్కడికి చేరుకోగానే హౌటల్ గదిలో క్రికెటర్లు కఠిన నిబంధనలు చవిచూడాల్సి వచ్చింది. కరోనా ప్రమాదం నేపథ్యంలో భారత జట్టు క్రికెటర్లు ఒకరినొకరు కలిసేందుకు వీలు కల్పించినా... రూమ్ సర్వీస్, భోజనం, హౌస్ కీపింగ్, టాయిలెట్ క్లీనింగ్ ఇలా ఎటువంటి సౌకర్యాలను అందించటం లేదు. క్రికెటర్లకు భోజనం కావాలంటే ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి ఆర్డర్ చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ.. క్వారంటైన్ సహా ఇతర కఠిన ఆంక్షలు ఎదుర్కొన్న భారత్ చివరి టెస్టుకు ముందు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి రావటం జట్టుకు ఇబ్బంది కలిగించేదే. గాయాలతో ఇబ్బందిపడుతున్న రహానె సేన.. ఇప్పుడు టెస్టుకు ముందు కోవిడ్ ఆంక్షలను అధిగమించేందుకు మరో కీలక పరీక్ష ఎదుర్కొంటుంది.