Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత కెప్టెన్ వైపు చూపు
జైపూర్ : ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ను వదులుకునేందుకు ఐపీఎల్ మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ సిద్ధమవుతోంది. 2021 ఐపీఎల్ సీజన్ కోసం ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. జవనరి 20 వరకు అన్ని ప్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు అందజేయాల్సి ఉంది. 2020 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. స్టీవ్ స్మిత్ బ్యాట్స్మన్, నాయకుడిగా ప్రభావం చూపటంలో విఫలమయ్యాడని రాయల్స్ యాజమాన్యం భావిస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్లో స్మిత్ బ్యాటింగ్ ఆర్డర్లో తన స్థానాన్ని మూడుసార్లు మార్పు చేసుకున్నాడు. 131 స్ట్రయిక్రేటుతో 331 పరుగులే చేశాడు. 2008లో ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న రాయల్స్ 2013, 2015, 2018 సీజన్లలోనూ ప్లే ఆఫ్స్కు చేరుకుంది. 2018లో అజింక్య రహానె నాయకత్వం వహించాడు. ప్రాంఛైజీపై నిషేధానికి ముందు స్మిత్ను రూ.12.5 కోట్లకు అట్టిపెట్టుకున్న రాయల్స్... 2018లో అతడిని తిరిగి జట్టులోకి తీసుకుంది. భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ సంజు శాంసన్ను రాయల్స్ రూ. 8 కోట్లకు సొంతం చేసుకుంది. జట్టులో జోశ్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి స్టార్, సీనియర్స్ ఉన్నప్పటికీ సంజు శాంసన్ను కెప్టెన్ను చేసేందుకు రాయల్స్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.