Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏతో బీసీసీఐ వాగ్వివాదం
బ్రిస్బేన్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒత్తిడికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తలొగ్గింది. బ్రిస్బేన్లో నాల్గో టెస్టు కోసం భారత జట్టు మంగళవారం అక్కడికి చేరుకుంది. కరోనా వైరస్ కొత్త కేసుల నేపథ్యంలో.. బ్రిస్బేన్లో ఆంక్షలు విధించారు. దీంతో అక్కడ హౌటల్ గదిలో కనీస సేవలను సైతం క్రికెటర్లకు నిరాకరించారు. హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బేవరేజెస్ సదుపాయాలు, స్విమ్మింగ్ పూల్ ప్రవేశం, వ్యాయామశాల అనుమతులు క్రికెటర్లకు ఇవ్వలేదు. ఫిట్నెస్ సమస్యలతో సతమతం అవుతున్న టీమ్ ఇండియా, ఆంక్షలతో మరింత ఇబ్బందుల్లో పడింది. ఈ వ్యవహారంపై స్పందించిన బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నతాధికారులతో బీసీసీఐ అధికారులు వాడివేడిగా ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. సిరీస్ ఆరంభానికి ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా, భారత జట్టుకు సౌకర్యాలు కల్పించాలని బోర్డు కోరింది. క్రికెట్ ఆస్ట్రేలియా అందుకు అంగీకారం తెలిపింది. బుధవారం నాటికి క్రికెటర్లకు ఈ సదుపాయాలు అందుబాటులోకి రాకపోయినా.. గురువారం ఉదయం నుంచి సాధారణ సేవలు పొందే అవకాశం ఉంది. జనవరి 15 నుంచి గబ్బాలో ఆస్ట్రేలియా, భారత్ చివరి టెస్టులో పోటీపడనున్నాయి. టెస్టు మ్యాచ్ ఆరంభం తర్వాత, క్రికెటర్ల ఫోకస్ పూర్తిగా ఆటపైనే మారనుందని అప్పుడు ఆంక్షల లొల్లి పెద్ద విషయం కాబోదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.